)
Pitru Paksha 2025: మాములుగా ప్రతి యేడాది తద్దినాలు పెడుతున్నాము. ఇక పెత్తనమాస దినాల్లో శ్రాద్దం కూడా పెట్టాలనే నియమం ఉందా.. ? శాస్త్రం ఏం చెబుతుందంటే.. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలనేది శాస్త్ర వచనం. అలా జరగాలంటే... పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన కుమారులే వారికి ా అన్నం అందించాలి. అపుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. మరణించిన తండ్రి లేదా తల్లి తిథి నాడు కుమారుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో పురాణా కాలం నుంచి వస్తున్న ఆచారం. పితృ తిథి నాడు కుమారుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు.మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి ? వారి గతి అధోగతేనా ? ధర్మ శాస్త్రం ఏమి చేస్తుందంటే..
మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదరులు.. సోదరిమణులు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉంటారు. యుద్ధాలలో కానీ , ఇతరత్రా ద్వారా కానీ, ఆత్మహత్యల వల్ల కానీ, ప్రకృతి విపత్తులైన భూకంపాలు, వరదలు వల్ల కన్నుమూసి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని పై లోకాలకు పంపడం కోసమే ఈ మహాలయ పక్షాలు ముఖ్య ఉద్దేశ్యం.
పితృతిథి నాడు మూడు తరాల వారికి పితృ, పితామహా, ప్రపితామహా (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం చేస్తాము. కానీ, ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజుల్లో పితృ వంశం.. మాతృ వంశం మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంటుంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధిగా పిలుస్తారు.
ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం, పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయ పక్షాల్లో పెట్టడం వలన పోతుందనేది ధర్మ శాస్త్రం చెబుతున్న విధి. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .. పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ ఈ సందర్భంగా దీవిస్తారు.
మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?
సాధారణంగా కన్నతండ్రి కన్నుమూసిన తిథినాడు మహాలయం పెట్టడమే అత్యుత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం అత్యంత ముఖ్యమైనది. దీనినే.. సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ...వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయ శ్రాద్ధం పెట్టాలంటారు. లాస్ట్ ఇయర్ చనిపోయిన వారికి భరణి నక్షత్రం రోజున లేదా పంచమి తిథులలో మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.
భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలనేది శాస్త్ర వచనం. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన శ్రీమతిని తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టాలి. అంతేకాదు వారికి పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర, పెట్టి సత్కరించి పంపాలి. చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టి తీరాలనేది శాస్త్రం చెబుతున్న మాట. ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్ధశి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.