)
If there is not find crow what will do after pinda pradan: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన కూడా చాలా మంది పితృ పక్షం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్రభావమో మరేంటో కానీ.. పెద్దలకు మాత్రం ఏదో రకంగా తమకు తోచిన విధంగా శ్రాద్దకర్మలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది తమ పూర్వీకులకు ఇష్టమైన పదార్థాల్ని, వస్త్రాలను పండితులకు, పేదలకు దానంగా ఇస్తున్నారు.
చాలా మంది పితృ పక్షం కార్యక్రమాలు చేసిన తర్వాత కాకులు ముట్టుకుంటేనే మనంచేసిన దాన్ని పూర్వీకులు స్వీకరించారని భావిస్తారు. మన పూర్వీకులు కాకుల రూపంలో భూమి మీదకు వచ్చారని నమ్ముతుంటారు. ఒక వేళ కాకులు కనీసం మనం చేసిన కార్యాన్ని చూసిన కూడా మన పూర్వీకులు, శ్రాద్దంలను స్వీకరించారని నమ్ముతుంటారు.
అయితే..ప్రస్తుతం చాలా చోట్ల కాకులు అస్సలు కన్పించడంలేదు. కాకుల కోసం కా.. కా.. అని ఎంతగా అర్చి గీ పెట్టిన ఒక్క కాకి కూడా కన్పించడంలేదు. ఈ క్రమంలో కాకి లేకుంటే శ్రాద్దం చేసిన పిండాలను.. ఆవులకు లేదా నీళ్లలోని జలచరాలకు పెట్టాలని పండితులు చెబుతారు.
అంతే కాకుండా.. దర్భబ్రాహ్మణుల మాదిరిగా దర్భలతో కాకులు చేసి దాన్ని పిండప్రదానం చేసిన పాత్రపై పెడితే..కాకులు ముట్టినట్లు భావిస్తారు. దీనితో కూడా మనకు పుణ్యం వస్తుంది. కానీ కాకిముట్టుకుంటేనే నిజమైన ఫలితం దక్కినట్లు అని పెద్దలు అనాదీగా నమ్ముతుంటారు. అందుకే పూర్వీకుల శ్రాద్ద కార్యాలను నదీతీరంలో, పుణ్యప్రదేశాలలో, తీర్థయాత్రలలో నిర్వహిస్తుంటారు. అక్కడ కాకులు ఎక్కువగా సంచారం చేస్తుంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook