Tirumala Darshan Tickets: తిరుమల ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లు విడుదల, ఏ టికెట్లు ఎప్పుడు

Tirumala Darshan Tickets: వేసవి కావడంతో తిరుమలలో రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఆగస్టు నెల కోటా టికెట్లు మూడు నెలలు ముందే విడుదలయ్యాయి. ఇందులో వివిధ రకాల టికెట్లు ఉన్నాయి. ఏ టికెట్లు ఎప్పుడు విడుదల కానున్నాయో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 17, 2025, 12:18 PM IST
Tirumala Darshan Tickets: తిరుమల ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లు విడుదల, ఏ టికెట్లు ఎప్పుడు

Tirumala Darshan Tickets: వేసవి కారణంగా తిరుమలలో భక్తులు కిటకిటలాడుతున్నారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. రోజుకు 60-65 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ భక్తులతో నిండిపోయి కన్పిస్తోంది. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంటోంది. సాధారణ భక్తులకు దర్శన సమయం 14-16 గంటలు పడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

తిరుమల స్వామివారి దర్శనం కోసం ఆగస్టు నెల కోటా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. దాదాపు మూడు నెలల ముందే 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి చేసుకోవచ్చు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు ఈ నెల 21 నుంచి 23 మద్యాహ్నం వరకు డబ్బులు చెల్లించి టికెట్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, సాలకట్ల పవిత్రోత్సవాలకు ఆన్‌లైన్ బుకింగ్ ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. వర్చువల్ విధానంలో శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ కోసం అదే రోజు మద్యాహ్నం 3 గంటలకు బుకింగ్ ఉంటుంది.

ఇక తిరుమల స్వామి సన్నిధిలో అంగ ప్రదక్షిణం కోసం ఆన్‌లైన్ టోకెన్లు ఈ నెల 23 ఉదయం 10 గంటల నుంచి తీసుకోవచ్చు. శ్రీవాణి టికెట్లు కూడా అదే రోజు ఉదయం 11 గంటలకు పొందవచ్చు. ఇక సీనియర్ సిటిజన్, దివ్యాంగ కోటా టికెట్లు మద్యాహ్నం 3 గంటలకు తీసుకోవచ్చు. ఆగస్టు నెలలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం ఈ నెల 24 ఉదయం 10 గంటలకు బుకింగ్ ఉంటుంది. వసతి గదుల బుకింగ్ కూడా అదే రోజు అందుబాటులో ఉంటుంది. మద్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా సందర్శించాల్సి ఉంటుంది. ఇక శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ, టీమ్ లీడర్స్ సేవల కోసం ఆగస్టు నెల కోటా ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదలవుతుంది. ఈ టీకెట్లను https://ttdevasthanams.ap.gov.in ద్వారా పొందవచ్చు.

Also read: Shakti Cyclone: ఏపీకు పొంచి ఉన్న తుపాను ముప్పు, భారీ వర్షాలు తప్పవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News