)
Tirumala Top 10 FAQs: తిరుమల శ్రీవారి దర్శనం కావాలంటే అంత సులభం కాదు. మనం అనుకుంటే కాదు ఆయన పిలిస్తేనే సాధ్యం. దేవుడే పిలిస్తే అన్ని అలా కుదిరిపోతాయి అంతే! అయితే తిరుమలను సందర్శించే సమయంలో భక్తులకు సాధారణంగా కొన్ని ప్రశ్నలు, సందేహాలు వస్తుంటాయి. తొలిసారి దర్శించుకోవాలనుకునేవారికి ప్రతిదీ ఓ సందేహామే. తరచూ దర్శించుకునే వారికి కూడా అనేక సందేహాలు వస్తుంటాయి. తరచూ తిరుమల విషయమై వచ్చే సందేహాలు ఏమిటో తెలుసుకుందాం. దర్శనం, గదులు, పూజలు తదితర అంశాలపై తిరుమల భక్తుల ప్రశ్నలు ఇలా ఉన్నాయి. వాటి ప్రశ్నలు-సమాధానాలు ఇవే.
తిరుమల భక్తుల సందేహాలు, జవాబులు
దర్శనం టికెట్లు లేవు. దర్శనం టికెట్లు ఎక్కడ లభిస్తాయి?
దర్శనం టికెట్లు ఆన్లైనలో బుక్ చేసుకోకపోతే తిరుమలలోని కొన్ని ప్రాంతాల్లో టోకెన్లు లభిస్తాయి. తిరుమల దర్శనానికి సంబంధించి ఎస్ఎస్డీ టోకెన్లు దొరుకుతాయి. విష్ణు నివాసం, శ్రీనివాస నివాసం, భూదేవి కాంప్లెక్స్ వంటి చోట మరుసటి రోజు దర్శనానికి ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి కౌంటర్లు ప్రారంభమవుతాయి.
ఎస్ఎస్డీ టోకెన్లు అంటే ఏమిటి?
ఎస్ఎస్డీ టోకెన్లు అంటే టైమ్ స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు. మీకు ఇచ్చిన సమయం ప్రకారం వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.
ఎస్ఎస్డీ టోకెన్లు లేకపోతే దర్శనం చేసుకోలేమా?
ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తులు నేరుగా తిరుమల లోని సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. సాధారణ రోజుల్లో 8 నుంచి 10 రద్దీ ఉన్న రోజుల్లో 16 నుండి 24 వరకు పట్టే అవకాశం ఉంటుంది.
మెట్ల మార్గంలో దర్శనం టోకెన్లు ఇస్తారా? ఎలా తీసుకోవాలి?
తిరుమల ప్రవేశ ద్వారం అలిపిరి మెట్లు మార్గంలో దర్శనం టోకెన్లు ఇవ్వరు. భూదేవి కాంప్లెక్స్లో దర్శనం టోకెన్ తీసుకోవాలి. శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వెళ్లే భక్తులు మార్గమధ్యలో 1,200 మెట్టు వద్ద టోకెన్ స్కానింగ్ చేసుకోవాలి.
చిన్నపిల్లల దర్శనం ఎప్పుడు కల్పిస్తారు.
రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ప్రధాన ఆలయం ఎడమ వైపు ఉన్న సుపథం మార్గం ద్వారా చిన్నపిల్లలతో దర్శనానికి వెళ్లవచ్చు. అయితే విశేష పర్వదినాల్లో సుపథం దర్శనాలు రద్దు చేస్తారు.
సుపథం చిన్నపిల్లల దర్శన్లు ఎవరెవరు వెళ్లవచ్చు?
సుపథం ద్వారా చిన్నపిల్లలు అంటే ఒక సంవత్సరంలోపు వయసు కలిగి ఉన్న తల్లిదండ్రులను మాత్రమే అనుమతి ఇస్తారు. చిన్నపిల్లల ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ కచ్చితంగా ఉండాలి. దర్శనానికి పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. సహాయకులను అనుమతించరు.
ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు. తిరుమల కొండపై గది లభిస్తుందా? గది లభించకపోతే ఎలా?
తిరుమలలో కచ్చితంగా గది లభిస్తుంది. సీఆర్ఓ కార్యాలయం వద్ద క్యూలైన్లోకి వెళ్లితే గదులు లభిస్తాయి. ఖాళీలకు అనుగుణంగా మీకు గదులు కేటాయిస్తారు. ఒకవేళ గదులు లభించని పరిస్థితుల్లో యాత్రి సదన్లో లాకర్స్ తీసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు.
వయోవృద్ధులు, దివ్యాంగులకు తిరుమల దర్శనం ప్రత్యేక అవకాశం ఏమైనా ఉందా?
వయోవృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్లైన్లో దర్శనం ఉండదు. 3 నెలల ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంది.
300 ప్రత్యేక దర్శనం టికెట్లు తిరుమలలో లభిస్తాయా?
తిరుమల కొండపై 300 ప్రత్యేక దర్శనం టికెట్లు లభించవు. 3 నెలల ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి.
బ్రేక్ దర్శనం లేఖ/ సిఫారసు లేఖపై ఎంత మంది దర్శనానికి వెళ్లవచ్చు?
ఆరుగురు వెళ్లవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.