)
Ugadi Special Story In Telugu: ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 30వ తేదీన వచ్చింది. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగలు ఈ పండగ కూడా ఒకటి. ఈ పండగ రోజున అందరూ ఎంతో ఇష్టమైన పిండివంటలను తయారుచేసుకుని తింటూ ఉంటారు. అలాగే ఇష్టదేవతలను కొలుస్తూ ఉంటారు. ఈ పండగను భారత దేశవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు. ఉగాది పండగకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పేరుతో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని పల్లెటూర్లలో దేవాలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున తప్పకుండా కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది. ఆ పనులు ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అభ్యంగనం (నూనెతో తలంటు స్నానం):
ఉగాది రోజున ఉదయాన్నే శుభ సమయంలో నిద్ర లేచి ముందుగా అభ్యంగన స్నానం చేయాల్సి ఉంటుంది. దీనికోసం నువ్వుల నువ్వుల నూనెతో తలంటుకొని.. ఈ స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది. ఇలా అభ్యంగన స్నానం చేయడం వల్ల మనస్సు కూడా శుద్ధి అవుతుందని ఒక నమ్మకం.
ఇంటిని అలంకరించడం:
ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరు ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కట్టుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కొన్ని చోట్ల అయితే ఈరోజు సంక్రాంతితో సమానంగా రంగురంగుల ముగ్గులను ఇంటి ముందు అలంకరిస్తారు. ఇలా చేయడం శుభానికి చేసినంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం..
ఉగాది పచ్చడి తయారుచేయడం, తినడం:
ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం.. దీనిని తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు రుచులతో కూడిన పదార్థాలతో తయారుచేస్తారు. ఇది జీవితంలోని సంతోషం, దుఃఖం, కోపం, భయం, అసహ్యం, ఆశ్చర్యం స్వీకరించాలని భావనను తెలియజేస్తాయి. కాబట్టి అన్ని రుచులతో కూడిన పచ్చడిని ఉగాది పండుగ రోజున ఆస్వాదించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
పంచాంగ శ్రవణం:
ఉగాది రోజున దేవాలయాలలో లేదా ఇంట్లో పండితులు కొత్త సంవత్సరపు పంచాంగాన్ని చదవడం పూర్వీకుల నుంచి వస్తోంది. దీనిని వినడం ద్వారా రాబోయే సంవత్సరంలో తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చనే భావనతో ఈ కార్యక్రమాన్ని ఉగాది పండగ రోజున నిర్వహిస్తారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు తప్పకుండా అభ్యంగన స్నానం చేయాల్సి ఉంటుంది.
దేవాలయాలకు వెళ్లడం:
హిందువులకు ఎంతో ముఖ్యమైన పండగ ఉగాది.. కాబట్టి ఈరోజు తప్పకుండా దైవ దర్శనం చేసుకోవాలని పురాణాల్లో తెలిపారు. అప్పటినుంచి ప్రతి ఉగాది రోజున దేవాలయానికి వెళ్లడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఈ కొత్త సంవత్సరం రోజున దేవాలయాన్ని సందర్శించడం వల్ల ఏడాది మొత్తం సుఖసంతోషాలు కలుగుతాయని ఒక నమ్మకం..
అందరితో జరుపుకోవడం:
ఉగాది పండుగ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకోవడం ముఖ్యమని పురాణాల్లో తెలిపారు. పండగ రోజున ఎలాంటి గొడవలు లేకుండా ఇతరులను దూషించకుండా పండగ జరుపుకోవడం ఉత్తమమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈరోజు ఇతరులను కష్టపెట్టడం కూడా మంచిది కాదని వారు అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook