)
Ind vs SL Highlights: ఆసియా కప్లో అత్యంత ఉత్కంఠగా జరిగిన సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు చెమటోడ్చింది. అతి కష్టంగా విజయాన్ని అందుకోగా.. హ్యాట్రిక్ ఓటమితో శ్రీలంక స్వదేశం చేరింది. ఆసియా కప్లో ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగిన భారత్కు వరుస భారీ షాక్లు ఎదురవుతున్నాయి. ఆఖరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో పసికూన ఓమన్ చేతిలో ఓడిపోయే మ్యాచ్ను కాపాడుకుని టీమిండియా పరువు నిలబెట్టుకుంది. సూపర్ 4 లో శ్రీలంకతో పోరాడి విజయాన్ని అందుకుంది. ఆసియా కప్ ఫైనల్ ముంగిట ఇలా భారత్ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం సవాల్గా మారింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఫైనల్లో ఎలా ఆడుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దుబాయ్లో జరుగుతున్న ఆసియా కప్లో భాగంగా సూపర్ 4లో శనివారం భారత్, శ్రీలంక బరిలోకి దిగాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ మరోసారి అర్థ సెంచరీతో చెలరేగి ఆడాడు. 31 బంతుల్లో 61 పరుగులు చేయగా.. తెలంగాణ పోరడు తిలక్ వర్మ 34 బంతుల్లో 49 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కొద్దిలో అర్థ సెంచరీని కోల్పోయాడు. సీనియర్ ఆటగాడు సంజూ శామ్సన్ 39 స్కోర్తో పర్వాలేదనిపించగా.. మిగిలిన బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు. చరీత్ హసలంక, డసూన్ శనక, మహీశ్ తీక్షణ ఒక్కో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక అద్భుతంగా పోరాడింది. చివరి బంతి వరకు విజయం కోసం శ్రమించి స్కోర్ను సమం చేసింది. 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి మ్యాచ్ను డ్రాగా ముగించింది. పాథుమ్ నిస్సాంక సెంచరీతో దుమ్మురేపాడు. భారత బౌలర్లను ఉతికి ఆరేశాడు. 58 బంతుల్లో 107 పరుగులు చేసి నిస్సాంక అనేక రికార్డులు నమోదు చేశాడు. అతడికి తోడుగా కుశాల్ పెరెరా 32 బంతుల్లో 58 పరుగులు తీసి గొప్ప సహకారం అందించాడు. శనక 22 పరుగులతో నాటౌట్గా నిలిచి స్కోర్ను సమం చేశాడు. భారత బౌలర్లు స్కోర్ను కాపాడడంలో విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.
స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా శ్రీలంక స్కోర్ తీయడంలో విఫలమైంది. అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేయడం బరిలోకి దిగిన శ్రీలంక ఒక్క పరుగే చేయగా.. ఒక వైడ్తో మొత్తం రెండు పరుగులు చేసింది. బ్యాట్ అందుకున్న సూర్య కుమార్ తొలి బంతికే మూడు పరుగులు తీయడంతో భారత్ విజయం సాధించింది. గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఇంతగా పోరాడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఫైనల్ ఆసియా కప్ను అందుకుంటుందని అందరూ భావిస్తుండగా పసికూన ఓమన్తోపాటు ఇప్పుడు శ్రీలంక నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంపై భారత జట్టు దృష్టి సారించాల్సి ఉంది. బౌలింగ్ దళం పటిష్టం కావాల్సి ఉంది. మరి రేపు జరగనున్న ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఎలా ఆడుతుందనేది ఉత్కంఠ నెలకొంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో ఓడించిన భారత్ ఫైనల్లో కూడా అదే చేయాలని యావత్ భారతావని కోరుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook