)
Asia Cup 2025: ఆసియా క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్ లో జరిగిన ఉత్కఠ పోరులో పాకిస్థాన్ పై భారత్ విజయ భేరి మోగించింది.ఈ నేపథ్యంలో కరీంనగర్ మహా శక్తి ఆలయ ప్రాంగణంలో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి మ్యాచ్ను తిలకించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మ్యాచ్లో భారత్ గెలుపొందడంతో..ఆ ప్రాంగణం మొత్తం త్రివర్ణ పతాకం చేత పట్టుకొని జై భారత్, భారత్ మాతా కీ జై అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అటు దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ నిర్దేశించిన 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో భారత్ దిగ్విజయంగా ఛేదించింది. మొదట్లోనే అభిషేక్ శర్మ, సూర్యకుమార్, శుభ్మన్ గిల్ను కోల్పోయి చిక్కుల్లో పడిన భారత్ను విజయ తీరాలకు చేర్చడంలో తిలక్ వర్మ కీలకంగా వ్యవహరించాడు. 53 బంతుల్లో 69 పరుగులు చేసి మర్చిపోలేని విజయాన్ని అందించాడు. తిలక్తో కలిసి సంజూ శాంసన్ 24, దూబే 33 కీలక భాగస్వామ్యాల్ని నెలకొల్పారు. సరైన సమయంలో దూబే బౌండరీలు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రాఫ్ మూడు వికెట్లు, అబ్రార్ అహ్మద్, షహీన్ అఫ్రీదీ చెరో వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్కు దిగిన పాక్ 146 పరుగులు చేసింది. సాహిబ్జాదా 57, ఫకార్ జమాన్ 46 రాణించారు. మొదట్లో పటిష్ఠ స్థితిలో కనిపించిన పాక్ మిడిల్ ఓవర్స్లో భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 146 పరుగులకే చతికిల పడింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ ఏకంగా 4 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. పాక్ జట్టులో ఫర్హాన్, ఫకార్, సైమ్ మాత్రమే రెండంకెల పరుగులు చేయగలిగారు.
టీమిండియా 9వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం అవార్డు ప్రెజెంటేషన్ నాటకీయంగా సాగింది. ఆసియా కప్ ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత దాదాపు గంటకుపైగా తర్వాత ప్రెజెంటేషన్ సెర్మనీ ప్రారంభమైంది. భారత జట్టు ట్రోఫీ తీసుకోదని ముందు నుంచే వార్తలు వచ్చాయి. పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీనే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్కు ప్రెసిడెంట్గా ఉండటమే అందుకు కారణం. ఆయన చేతుల మీద ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు ముందుకు రాలేదు. టీమిండియా తమ అవార్డులను తీసుకోవడం లేదని ఏసీసీ నుంచి తనకు సమాచారం అందింది. కాబట్టి, అవార్డు ప్రెజెంటేషన్ ముగిసింది.’అని ప్రెజెంటర్ సిమోన్ డౌల్ తెలిపారు. ట్రోఫీ లేకుండానే భారత ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఆడొద్దని డిమాండ్ వ్యక్తమైంది. ఐసీసీ, ఏసీసీ నిబంధలను గౌరవించి భారత జట్టు టోర్నీలో పాల్గొంది. పాక్తో మ్యాచ్ల్లో ఆడామా?గెలిచామా? అన్నట్టే టీమిండియా ప్లేయర్లు వ్యవహరించారు. ఆ జట్టుతో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ పాక్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం చేయలేదు. షేక్హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యతో భారత జట్టు పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు మద్దతుగా ఉంటామనే సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత జట్టు ట్రోఫీని కూడా తీసుకోలేదు.ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ..ట్వీట్ చేశారు. ప్రధాని మోడీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జట్టు విజయంతో సంబరాలు చేసుకున్నారు. పాక్ కు యుద్ద మైదానంలోనే కాదు.. క్రికెట్ మైదానంలో తుక్కు తుక్కుగా ఓడిస్తామనే సందేశం ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.