ఇండియా Vs సౌతాఫ్రికా: తొలి టెస్టు తలపడే భారత జట్టు ఇదే...

ఏసీఏ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో  తొలి టెస్టుకు 11 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Last Updated : Oct 1, 2019, 03:49 PM IST
ఇండియా Vs సౌతాఫ్రికా: తొలి టెస్టు తలపడే భారత జట్టు ఇదే...

విశాఖ : ఏసీఏ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో  తొలి టెస్టుకు 11 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టులో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలో దిగనున్నారు. టాప్, మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ తో పాటు ఛటేశ్వర పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్) తదితర సీనియర్లు ఉన్నారు.

కాగా  తెలుగుతేజం హనుమవిహారి కూడా తుదిజట్టులో స్థానం కల్పించారు. అలాగే పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో అశ్విన్, జడేజాలకు స్థానం కల్పించారు. పేసర్ల విభాగంలో ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలకు స్థానం కల్పించారు.

ప్రస్తుత ఫాంను పరిగణనలోకి తీసుకొని తొలి టెస్టుకు పంత్ ను పక్కనబెట్టారు. అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. రేపటి నుంచి సఫారీలతో జరిగే తొలిటెస్టు పోరులో టీమిండియా తలపడనుంది.

తొలి టెస్టుకు టీమిండియా ఇదే..

రోహిత్ శర్మ
మయాంక్ అగర్వాల్
 ఛటేశ్వర్ పుజారా
విరాట్ కోహ్లీ (కెప్టెన్)
అజింక్యా రహానే (వైస్ కెప్టెన్)
హనుమ విహారి
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్)
రవిచంద్రన్ అశ్విన్
రవీంద్ర జడేజా
ఇషాంత్ శర్మ
మహ్మద్ షమీ

Trending News