యువ బ్యాట్స్ మెన్స్ మాయంక్ అగర్వాల్ డబుల్ ధమాకా సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొత్తం 371 బంతులు ఎదుర్కొని 215 పరుగుల చేసి మయాంక్ ఔట్ అయ్యాడు . అంతకుముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ (176)తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పిన మయాంక్ భారత్ కు భారీ స్కోర్ అందించాడు.
ప్రస్తుతం 122 ఓవర్లు ఎదుర్కొన్న భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 446 పరుగు స్కోర్ సాధించింది. రోహిత్ శర్మ(176) ఔట్ తర్వాత పుజారా(06) కోహ్లీ (20) వికెట్ల త్వరగా వికెట్లు పడినప్పటికీ అంజికా రహానే(08)తో కలిసి మాయంగ్ స్కోరు బోర్డును ముందుకు కదిలించే ప్రయత్నం చేశాడు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో మాయాంక్ ఇల్గర్ వేసిన పదునైన బంతికి ఔట్ అయి వెనుదిరిగాడు.
అనంతరం అంజిక్యారహానేకూడా (15) తక్కువ స్కోరుకే ఔట్ గా వెనుదిగాడు. ప్రస్తుతం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(5), హనుమ విహారీ (08) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఐదు వికెట్లకు 446 స్కోర్ చేసిన భారత్... ఈ రోజు సాధ్యమైన ఎక్కువ పరుగుల సాధించి సౌతాఫ్రికాను ఒత్తిడి నెట్టాలనే వ్యూహంతో తన ఆట కొనసాగిస్తోంది.