IPL 2025: ధనాధన్ ఫైట్.. నేటి నుంచే ఐపీఎల్ రచ్చ..

IPL 2025 opening Ceremony: క్రికెట్ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడికి వేళైంది. నేటి నుంచే 18వ సీజన్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. మే 25న ఫైనల్ జరగనుంది.దాదాపు రెండు నెలలపాటు ఐపీఎల్ సందడి చేయనుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2025, 09:21 AM IST
IPL 2025: ధనాధన్ ఫైట్.. నేటి నుంచే ఐపీఎల్ రచ్చ..

IPL 2025 opening Ceremony: ఐపీఎల్ పొట్టి క్రికెట్ 18వ సీజన్ కు అంతా సిద్ధమైంది.మొత్తం 10 జట్లు 74 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 13 వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు ఏలో చెన్నయ్ సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు ఉండగా.. గ్రూపు బిలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ జట్లను చేర్చారు. ప్రతి జట్టు గ్రూపు దశలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అందులో 7 సొంతగడ్డపై, మరో 7 బయట ఆడతాయి. ఒక జట్టు తమ గ్రూపులోని జట్లతో, ఇతర గ్రూపులోని ఒక జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఇతర గ్రూపులోని నాలుగు జట్లతో చెరో మ్యాచ్ ఆడుతుంది.

Add Zee News as a Preferred Source

మెగా వేలంలో నేపథ్యంలో 10 జట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పలు ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే మార్చేశాయి. రజత్ పాటిదార్, అక్షర్ పటేల్ తొలిసారిగా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ కోసం రజత్‌ను సారథిగా ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను తమ కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గత సీజన్‌లో కోల్‌కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌‌ను ఆ ఫ్రాంచైజీ వదులుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేలంలో అతన్ని పంజాబ్ 26.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి పగ్గాలు అప్పగించింది. కేకేఆర్ సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానెకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. వేలంలో రిషబ్ పంత్ అన్ని రికార్డులను తిరిగరాశాడు. లక్నో అతని కోసం రూ. 27 కోట్లుకు  దక్కించుకుంది. లీగ్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో ఢిల్లీకి కెప్టెన్‌గా ఉన్న అతను ఈ సారి లక్నోకు నాయకత్వం వహించబోతున్నాడు.

ఐపీఎల్ 17 సీజన్లు పూర్తి చేసుకున్నా.. ఇంకా  టైటిల్ గెలవని జట్లు నాలుగు ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఒక్కసారి కూడా విన్నర్ గా కప్ ను అందుకోలేకపోయాయి.  ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ లీగ్ ప్రారంభం నుంచి ఉండగా..లక్నో మాత్రం 2022లో వచ్చింది. ప్రతి సీజన్‌లో ఏదో ఒక దశలో ఈ జట్లకు నిరాశ తప్పడం లేదు. గత సీజన్‌లో ఆర్సీబీ సంచలన ప్రదర్శన చేసినా ఎలిమినేటర్‌లో ఓడింది. ఢిల్లీ గత మూడు సీజన్లుగా ప్లే ఆఫ్స్‌ కూడా అర్హత సాధించలేకపోయింది. పంజాబ్ అయితే 2014లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత మరోసారి ప్లే ఆఫ్స్ గడప తొక్కలేదు. లక్నో తొలి రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరుకుని ఆకట్టుకుంది. లాస్ట్ ఇయర్  మాత్రం గ్రూపు దశకే పరిమితమైంది. ఈ నాలుగు జట్లకు ఈ సారి కొత్త కెప్టెన్లు వచ్చారు. కొత్త సారథులు ఈ సీజన్‌లోనైనా తమ జట్ల రాత మారుస్తారో లేదో చూడాలి.

ఐపీఎల్‌ను అభిమానులకు మరింత దగ్గర చేసేందుకు లీగ్ నిర్వాహకులు 2015 నుంచి ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లో ఫ్యాన్స్ కోసం స్క్రీనింగ్స్ పెట్టి స్టేడియానికి వచ్చిన అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ సారి కూడా దేశంలోని 50 నగరాల్లో ఈ ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ నుంచి నిజామాబాద్, వరంగల్ ఫ్యాన్ పార్క్‌లకు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, కాకినాడలలో ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్యాన్ పార్క్‌లకు ఎంట్రీ ఉచితం. అందులో స్కీనింగ్స్‌తోపాటు మ్యూజిక్, ఫుడ్ కోర్టులు, కిడ్స్ ప్లే జోన్, వర్చువల్ బ్యాటింగ్ జోన్, బౌలింగ్ నెట్స్‌తోపాటు ఇతర ఏర్పాట్లు చేస్తారు. వాటికి మాత్రం చార్జ్ చేయనున్నారు.

ఈ సీజన్‌లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం 9 మ్యాచ్‌లకు వేదికగా నిలవనుంది. అందులో హైదరాబాద్ జట్టుకు సంబంధించి 7 గ్రూపు దశ మ్యాచ్‌లు ఉండగా.. రెండో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్ జట్టు తమ తొలి గ్రూపు మ్యాచ్‌లో రాజస్థాన్ తలపడబోతుంది. ఆ తర్వాత ఈనెల 27న లక్నోతో, ఏప్రిల్ 6న గుజరాత్‌తో, 12న పంజాబ్‌తో 23న ముంబైతో, మే 5న ఢిల్లీతో, 10న కోల్‌కతాతో ఆడనుంది. మే 20న క్వాలిఫయర్ 1, 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కూడా ఈ సారి రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో హోం గ్రౌండ్‌గా వైజాగ్‌ను ఎంచుకుంది. ఈ నెల 24న లక్నోతో, 30నహైదరాబాద్‌తో తలపడనుంది.

ఈ సీజన్ ప్రారంభ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించబోతున్నారు. మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే 13 వేదికల్లోనూ ఈ సారి ఆరంభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బెంగళూరు, కోల్‌కతా మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గంట ముందే సాయంత్రం 6 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వనుంది. ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన గాత్రంతో ఫ్యాన్స్ ను మెస్మరైఅలరించనుంది. సింగింగ్ సెన్సేషన్ కరణ్ ఔజ్లా కూడా ఆరంభ వేడుకల్లో భాగం కానున్నాడు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News