IPL 2025 Points Table: తిరుగులేని ఆర్‌సీబీ.. ఐపీఎల్ పాయింట్స్‌ టేబుల్‌లో హైదరాబాద్ ఎక్కడంటే..?

IPL 2025 Points Table Latest Updates: ఈ ఐపీఎల్‌లో 300 స్కోరు కొట్టాలని సన్‌రైజర్స్, ఒక్కసారైనా ట్రోఫీని ముద్దాడాలని ఆర్‌సీబీ.. కొత్త కెప్టెన్లతో దుమ్ములేపాలని పంజాబ్, ఢిల్లీ, లక్నో.. మరోసారి విజేతగా నిలవాలని ఆర్‌ఆర్, గుజరాత్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని కేకేఆర్.. అత్యధిక టైటిల్స్ సాధించిన టీమ్‌గా నిలవాలని ముంబై, చెన్నై.. ఇలా అన్ని జట్లు ఈ సీజన్‌లో జోరు మీద ఉన్నాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 1, 2025, 01:02 PM IST
IPL 2025 Points Table: తిరుగులేని ఆర్‌సీబీ.. ఐపీఎల్ పాయింట్స్‌ టేబుల్‌లో హైదరాబాద్ ఎక్కడంటే..?

IPL 2025 Points Table Latest Updates: ఐపీఎల్ 2025 (IPL 2025) ట్రోఫీ కోసం అన్ని జట్లు తమ వేటను ఆరంభించాయి. ఇప్పటివరకు అన్ని జట్లు రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. పంజాబ్ కింగ్స్ మాత్రం ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడింది. మరికొన్ని జట్లు మూడు మ్యాచ్‌లు కూడా ఆడేశాయి. ఇప్పటికే అన్ని జట్లు పాయింట్ల ఖాతాను (IPL 2025 Points Table) ఓపెన్ చేశాయి. ఈసారైనా కప్ సాధించాలని పట్టుదలతో ఉన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధించి నాలుగు పాయింట్లతో టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. రన్‌రేట్ కూడా +2.266 అన్ని జట్ల కంటే చాలా ఎక్కువగా ఉంది. రెండోస్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ కూడా రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించగా.. నెట్‌రన్‌రేట్ +1.320 ఆర్‌సీబీ కంటే తక్కువగా ఉంది. 

Add Zee News as a Preferred Source

మూడోస్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో రెండు పాయింట్లు సాధించింది. లక్నోకు రన్‌రేట్ +0.963 ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉంది. గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపుతో రెండు పాయింట్లు, +0.625 రన్‌రేట్‌తో నాలుగోస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స ఆడిన ఒకే మ్యాచ్‌లో విజయం సాధించి ఐదోస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. రెండు ఓటములు, ఒక గెలుపుతో ఆరోస్థానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది. రెండు పాయింట్లు -0.771 రన్‌రేట్‌తో ఏడోస్థానంలో కొనసాగుతుంది. మొదట మ్యాచ్‌లోనే భారీ స్కోరుతో అంచనాలు పెంచేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ తరువాత రెండు మ్యాచ్‌ల్లోనూ దారుణంగా ఓటమిపాలైంది. రెండు పాయింట్లు, -0.871 రన్‌రేట్‌తో 8వ స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఒక గెలుపు, రెండు ఓటములతో తొమ్మిదోస్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకే గెలుపుతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.  

ఆరెంజ్ క్యాప్‌ రేసులో లక్నో బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 145 పరుగులు చేశాడు. రెండోస్థానంలో సాయి సుదర్శన్ (137), ట్రావిస్ హెడ్ (136), మిచెల్ మార్ష్‌ (124), అంకిత్ వర్మ (117) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. పర్పుల్ క్యాప్‌ రేసులో చెన్నై బౌలర్ నూర్ అహ్మద్ 9 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. మిచెల్ స్టార్క్ 8 వికెట్లతో రెండోస్థానంలో, ఖలీల్ అహ్మద్ (6), శార్దుల్ ఠాకూర్ (6), కుల్దీప్ యాదవ్ (5) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. 

Also Read: Sikandar Collections:‘సికందర్’కు దెబ్బ మీద దెబ్బ.. సల్లూ భాయికు చుక్కలు కనిపిస్తున్నాయి..  

Also Read: Sanoj Mishara:  డైరెక్టర్ సనోజ్ మిశ్రా అత్యాచారం ఘటనలో బిగ్ ట్విస్ట్.. షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చిన యువతి..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News