RCB vs MI: ఐపీఎల్‌ 2025లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జోరు.. ముంబై ఇండియన్స్‌ చిత్తు

Royal Challengers Bengaluru Won By 12 Runs Against Mumbai Indians: ఐపీఎల్‌లో మాజీ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చిత్తు చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు సంచలన విజయం సాధించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 8, 2025, 08:23 PM IST
RCB vs MI: ఐపీఎల్‌ 2025లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జోరు.. ముంబై ఇండియన్స్‌ చిత్తు

IPL 2025 RCB vs MI: ఐదు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని సాధించిన ముంబై ఇండియన్స్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చిత్తు చేసింది. నరాలు తెగే ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సంచలన ప్రదర్శన కనబర్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఐపీఎల్‌లో జోరు కనబర్చింది. ముంబై ఇండియన్స్‌పై 000 పరుగుల తేడాతో ఆర్‌సీబీ విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి బెంగళూరు 221 పరుగులు చేసింది. 9 వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్‌ 12 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది.

Add Zee News as a Preferred Source

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు భారీ స్కోర్‌ సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (7)తో సహా టాపార్డర్‌ బ్యాటర్లు మొత్తం పరుగులు రాబట్టలేకపోయారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (4), కెప్టెన్‌ రజత్‌ పాటిదర్‌ (12), ఫిల్‌ సాల్ట్‌ (14), కృనాల్‌ పాండ్యా (5) అతి తక్కువ పరుగులు చేశారు. అందరూ విఫలమవుతున్న వేళ లియాన్‌ లివింగ్‌స్టన్‌ (54) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడి అర్థ సెంచరీ సాధించాడు. అతడికి జితేశ్‌ శర్మ భాగస్వామ్యం పంచుకుని 33 పరుగులు సాధించి స్కోర్‌ బోర్డును పెంచాడు. రెండు విజయాలతో జోరు మీదున్న బెంగళూరును గుజరాత్‌ బౌలర్లు బెంబెలెత్తించారు. మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. అర్షద్‌ ఖాన్‌, ప్రసిధ్‌ కృష్ణ, ఇషాంత్‌ శర్మ, సాయి కిశోర్‌ తలా ఒక్కో వికెట్‌ తీశారు.

బెంగళూరు విధించిన 170 లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్‌ టైటాన్స్‌ ఛేదించింది. 17.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోసారి కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (14) భారీ స్కోర్‌ రాని పరిస్థితిలో సాయి సుదర్శన్‌ (49) తృటిలో అర్థ సెంచరీని మిస్సయ్యాడు. జోస్‌ బట్లర్‌ తనదైన బ్యాటింగ్‌తో 39 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 6 సిక్సర్లు, ఐదు ఫోర్లతో చెలరేగిపోయాడు. బట్లర్‌కు సహకరిస్తూనే రూథర్‌ఫోర్డ్‌ 30 పరుగులు సాధించాడు. బెంగళూరు బౌలర్లు పవర్‌ప్లేలో కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయగా.. దానిని ఆఖరు వరకు కొనసాగించలేకపోయారు. భువనేశ్వర్‌, హేజిల్‌వుడ్‌ తీసిన రెండు మినహా మిగతా బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News