
IPL 2025 Final Review: ఐపీఎల్ 2025 సీజన్ 18 ఫైనల్ మ్యాచ్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్లు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏ జట్టు గెలిచినా తొలి టైటిల్ అవుతుంది. అందుకే కీలకమైన ఆటగాళ్లపై భారం పెట్టుకున్నాయి. ఈ క్రమంలో రెండు జట్లు ఏయే ఆటగాళ్లపై అంచనాలు పెట్టుకున్నాయో తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025 సీజన్ 18 తుది పోరు మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. తొలి టైటిల్ కోసం పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ జట్లు పోటీ పడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుకు ఆయుధంగా మారింది. ఈ సీజన్లో టేబుల్ టాప్గా నిలిచిన పంజాబ్ జట్టు అద్భుతాలు చేసింది అన్క్యాప్డ్ ఆటగాళ్లతోనే. ఏకంగా ఆరుగురు అన్క్యాప్డ్ ఆటగాళ్ల జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. అందుకే ఇవాళ్టి ఫైనల్లో కూడా ఈ ఆటగాళ్లపైనే నమ్మకం పెట్టుకుంది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఇద్దరూ అన్క్యాప్డ్ ఆటగాళ్లే. ప్రియాంశ్ ఆర్యన్ తొలి సీజన్లోనే రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 451 పరుగుల సాధించాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ 4 హాఫ్ సెంచరీలతో 523 పరుగులు చేశాడు. నేహల్ వథేరా, శశాంక్ సింగ్ మిడిలార్డర్ బలంగా మారారు. శ్రేయస్ అయ్యర్ అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక అర్షదీప్, చాహల్, హర్ ప్రీత్ బ్రార్, విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో బలంగా ఉన్నారు.
అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ గెలిచి విరాట్ కోహ్లికి బహుమతిగా ఇవ్వాలనుకుంటోంది. ఓపెనర్లు విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ ఇద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఇద్దరికిద్దరు రెచ్చిపోయి ఆడుతున్నారు. రజత్ పాటిదార్ పరవాలేదు. జితేష్ శర్మ అద్భుతంగా అవసరమైనప్పుడు ఆదుకుంటున్నాడు. గాయం నుంచి కోలుకుంటే టీమ్ డేవిడ్ అదనపు బలం కానున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, యశ్ దయాల్, జోష్ హేజిల్ వుడ్ కీలకంగా మారారు. సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు స్పిన్తో కట్టడి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook