
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ 18 అట్టహాసంగా ప్రారంభమైంది. క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించే ఐపీఎల్ సీజన్ 18లో ఇప్పటికి మూడు మ్యాచ్లు ముగిశాయి. మూడింట్లోనూ వరుసగా మూడు దక్షిణాది ఫ్రాంచైజీలు విజయం సాధించాయి. ఎస్ఆర్హెచ్ మరోసారి భారీ స్కోర్ సాధిస్తే..మెరుపు స్టంపింగ్తో వయస్సుపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు ఎంఎస్ ధోని.
బెంగళూరు విజయం
ఐపీఎల్ 2025 సీజన్ 18 ప్రారంభ మ్యాచ్ కోల్కతాలో జరిగినా తరువాత రెండు మ్యాచ్లు దక్షిణాది వేదికగా జరిగాయి. మొత్తం మూడు మ్యాచ్లలో వరుసగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయం సాధించాయి. మార్చ్ 22వ తేదీన కోల్కతా ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 175 పరుగుల లక్ష్యాన్ని విధించగా విరాట్ కోహ్ల, ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలోనే 80 పరుగులు చేసేశారు. 7 వికెట్ల తేడాతో కేకేఆర్పై బెంగళూరు జట్టు విజయం సాధించింది.
హైదరాబాద్ విజయం
ఇక మార్చ్ 23 మద్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ వేదికగా జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు పండుగలా మారింది. ఎస్ఆర్హెచ్ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించింది. 286 పరుగులతో మరోసారి భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్, హెన్రిన్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ , నితీష్ కుమార్ రెడ్డిలు విరుచుకుపడ్డారు. 44 పరుగులతో ఆర్ఆర్పై విజయం సాధించింది.
చెన్నై విజయం
ఇక మార్చ్ 23 సాయంత్రం 7.30 గంటలకు చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే ఉంచగలిగింది. సీఎస్కే మరో ఐదు బంతులు మిగిలుండగా 6 వికెట్లు కోల్పోయి తొలి విజయం నమోదు చేసింది. మొత్తానికి మొదటి మూడు మ్యాచ్లలో దక్షిణాది జట్లు విజయం సాధించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి