)
Ravindra Jadeja in Rajasthan Royals: ఐపీఎల్లో సంజూ శాంసన్, రవీంద్ర జడేజా ప్రస్తుతం మారుమోగిపోతున్నాయి. ట్రేడింగ్కు బంధించి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య చర్చలు జరుగుతుండడంతో ఎవరు ఏ టీమ్లోకి వెళతారని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదట రవీంద్ర జడేజా కోసం మొదట సీఎస్కేను రాజస్థాన్ సంప్రదించగా.. కానీ చర్చలు ఫలించలేదు. అదే సమయంలో సంజూ శాంసన్ కోసం ఢిల్లీ కూడా ప్రయత్నించగా.. ఇవి కూడా విఫలమయ్యాయి. మొత్తానికి ఫైనల్గా సంజూ శాంసన్ను తీసుకునేందుకు చెన్నై ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. సీఎస్కే నుంచి రవీంద్ర జడేజాతోపాటు సామ్ కర్రాన్ లేదా మతిషా పతిరానాను తమకు ఇవ్వాలని రాజస్థాన్ కోరుతోంది. ఈ వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మొదట రాజస్థాన్తోనే అరంగేట్రం..
రవీంద్ర జడేజా ఐపీఎల్లో మొదట రాజస్థాన్ రాయల్స్తోనే ఎంట్రీ ఇచ్చాడు. 2008 మొదట సీజన్లో షేన్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ ఛాంపియన్గా నిలిచిన టీమ్లో రవీంద్ర జడేజా సభ్యుడిగా ఉన్నాడు. ఆ తరువాత సీజన్లోనూ రాజస్థాన్కు ఆడిన జడేజా.. ఆ తరువాత చేసిన ఓ తప్పుతో ఒక సీజన్ నిషేధానికి గురయ్యాడు. 2010లో జడేజా తన ఫ్రాంచైజీ రాజస్థాన్కు తెలియజేయకుండా ముంబై ఇండియన్స్కు మారడానికి ప్రయత్నించాడు. ముంబై ఫ్రాంచైజీతో చర్చలు జరపడంతో IPL గవర్నింగ్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఒక సీజన్ మొత్తానికి జడేజాపై వేటు వేసింది.
ఆ సమయంలో ఐపీఎల్ ఛైర్మన్గా ఉన్న లలిత్ మోడీ మాట్లాడుతూ.. IPL గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఆటగాళ్ల మార్గదర్శకాలు చాలా ముఖ్యమైనవి అని.. ప్రతి ఆటగాడు తప్పకుండా పాటించాలని అన్నారు. జడేజా తన ఫ్రాంచైజీకి తెలియకుండా మరో టీమ్తో చర్చలు జరపడం నిబంధనలకు విరుద్దమని.. అందుకే ఏడాది నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో రవీంద్ర జడేజాను 2010లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి విడుదల చేసింది.
రీఎంట్రీలో అదుర్స్
ఆ తరువాత సీజన్లో రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. కొచ్చి టస్కర్స్ కేరళ తరపున ఆడాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్ల్లో 283 పరుగులు, ఎనిమిది వికెట్లతో మంచి ప్రదర్శన చేశాడు. 2012 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్లో చేరాడు. ఆ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో జడేజా ఒకటిగా నిలిచాడు. అప్పటి నుంచి సీఎస్కే జడేజా ప్రయాణం కొనసాగుతోంది. 2016, 2017లో రెండు సీజన్లు చెన్నై టీమ్పై నిషేధం విధించినప్పుడు.. సురేష్ రైనా నాయకత్వంలో గుజరాత్ లయన్స్ టీమ్కు జడేజా ప్రాతినిధ్యం వహించాడు. ఆ తరువాత మళ్లీ సీఎస్కే టీమ్కు తరుఫున ఆడాడు. చెన్నై ఐదు టైటిళ్లు గెలవగా.. మూడు టైటిళ్లను గెలవడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. 2023 ఫైనల్లో జడేజా ఇన్నింగ్స్ మరపురానిది. మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్లో జడేజా అద్భుతంగా ఆడి టీమ్ను ఛాంపియన్గా నిలిపాడు. 2022 సీజన్లో చెన్నైకు టీమ్కు కొన్ని మ్యాచ్లు కెప్టెన్గా వ్యవహరించినా.. సక్సెస్ కాలేకపోవడంతో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook