Newly wed couple post pone their honeymoon to see Lionel messi: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ భారత్ పర్యటనకు వచ్చాడు. అయితే.. దేశవ్యాప్తంగా అభిమానులు ఆయన్ను చూసేందుకు కోల్ కతాకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఎక్కడ చూసిన మెస్సీ మెనియా కన్పిస్తుంది. లియోనల్ తో ఫోటోలు దిగేందుకు రూ. 10 లక్షలు వసూలు చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం భారత్ లో లియోనల్ మెస్సీ పర్యటనతో ప్రపంచం చూపు అంతా భారత్ పై పడింది. ఈ క్రమంలో కోల్ కతాకు లియోనల్ మెస్సీ చేరుకున్నాడు.
#WATCH | West Bengal | A fan of star footballer Lionel Messi says, "... Last Friday we got married, and we cancelled our honeymoon plan because Messi is coming as this is important... We have been following him since 2010..." pic.twitter.com/9UKx0K9dGy
— ANI (@ANI) December 13, 2025
మూడు రోజుల "గోట్" (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) టూర్లో భాగంగా శనివారం తెల్లవారుజామున మెస్సీ కోల కతాకు చేరుకున్నారు. వేలాదిగా అభిమానులు ఫ్లకార్డుులు పట్టుకుని తమ అభిమానంను చాటుకున్నాడు. అయితే.. అక్కడ ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వీరిలో ఒక కొత్త జంట కూడా ఉన్నారు. వీరి ఫ్లకార్డు అందర్ని ఫిదా చేసింది.
దీనిలో.. గత శుక్రవారమే మాకు పెళ్లయింది. కానీ, మెస్సీని చూడటం కోసం మా హనీమూన్ను రద్దు చేసుకున్నామని రాసి ఉన్న ప్లకార్డ్ను యువతి పట్టుకుంది. అయితే.. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 2010 నుంచి మెస్సీకి డైహర్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకుంది. తనకు ఇటీవల పెళ్లి అయ్యిందని, ఇద్దరం కూడా మెస్సీకి వీరాభిమానులం అని చెప్పింది.
మెస్సీ నగరానికి వస్తున్నాడని తెలిసి.. తమ హనీమూన్ కూడా వాయిదా వేసుకున్నట్లు చెప్పింది. గతంతో 2011లో ఆయన వచ్చినప్పుడు చూసే అవకాశం రాలేదు. అప్పుడు మేము చాలా చిన్నవాళ్లమని, ఇప్పుడు మాత్రం ఆ చాన్స్ ను మిస్ చేసుకొవద్దని కోల్ కతాలోనే ఉండిపోయామని సదరు అభిమాని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యువతి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









