Bengaluru Stadium: బెంగళూరు తొక్కిసలాటకు కారణం ఆ ప్రచారమేనా, తప్పెవరిది

Bengaluru Stadium: ఐపీఎల్ 2025 విజేత ఆర్సీబీ విజయోత్సవ సభ తీవ్ర విషాదంతో ముగిసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలీ తొక్కిసలాట జరగడానికి కారణం ఆ ప్రచారమేనా..వాస్తవం ఏంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 5, 2025, 03:21 PM IST
Bengaluru Stadium: బెంగళూరు తొక్కిసలాటకు కారణం ఆ ప్రచారమేనా, తప్పెవరిది

Bengaluru Stadium: ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీతో పాటు భారీ సన్మానం ఏర్పాటు చేసింది. అయితే తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణనష్టం జరగడంతో ఇది కాస్తా రసాభాసగా మారింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటనకు కారకులెవరు, పోలీసులా లేక ప్రభుత్వమా లేక ఆర్సీబీ యాజమాన్యమా..అసలేం జరిగింది. 

Add Zee News as a Preferred Source

ఐపీఎల్ 2025 ట్రోఫీని 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు ఆర్సీబీ గెల్చుకుంది. దాంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ భారీ సన్మాన సభ ఏర్పాటు చేసింది. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు లక్షలాదిగా అభిమానులు స్టేడియంకు పోటెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 50 మందికి గాయాలయ్యాయి. ఇంతటి విషాదానికి కారణాలేంటని ప్రశ్నించుకుంటే చాలానే విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఓ ఫేక్ ప్రచారం కూడా తొక్కిసలాటకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆటగాళ్లతో బస్ పరేడ్ రద్దు కావడం కూడా ఓ కారణం కావచ్చని అంచనా. వాస్తవానికి బెంగళూరు విధాన సౌధ నుంచి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ ఉంటుందని ఆర్సీబీ ప్రకటించింది. అయితే వర్షం కారణంగా పరేడ్ రద్దయింది. దాంతో అభిమాన ఆటగాళ్లను ఎలాగైనా చూడాలనే కోరికతో స్టేడియంకు పోటెత్తారు. 

ఫ్రీ టికెట్స్ అంటూ ప్రచారం

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం సామర్ధ్యం కేవలం 35 వేలు. కానీ దాదాపు 3 లక్షల మంది చేరుకుని ఉంటారని అంచనా. ఈ స్టేడియంకు మొత్తం 13 గేట్లు ఉంటే 9, 10 గేట్లను బెంగళూరు క్రికెట్ అసోసియేషన్‌కు రిజర్వ్ చేశారు. ఇక 5,6,7 గేట్ల నుంచి ఎంట్రీ ఇచ్చారు. 7వ నెంబర్ గేట్ నుంచి ఆటగాళ్ల వ్యూ బాగా కన్పిస్తుంది. దాంతో అభిమానులంతా అదే గేట్ కు చేరుకున్నారు. కేవలం పాస్ ఉన్నవారికే అనుమతి ఉంటుంది. కానీ ఫ్రీ పాస్ లేదా ఫ్రీ టికెట్స్ ప్రచారం జరగడంతో అందరూ వాటికోసం పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. 

తప్పెవరిది

బస్ పరేడ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియంకు రానున్న సీఎం సిద్ధరామయ్య , ఇతర ప్రభుత్వ పెద్దలకు ఏర్పాట్లలో పోలీసులు ఉండిపోయారు. ఫలితంగా స్టేడియం వల్ల 5 వేల మంది పోలీసులే ఉన్నారు. ఫ్రీ టికెట్ల ప్రచారం, పరేడ్ రద్దు కావడంతో భారీగా అభిమానులు స్టేడియంకు పోటెత్తారు. అంచనాకు మించిన జనం కావడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. స్టేడియం గేట్లు కూడా చిన్నవి కావడంతో తొక్కిసలాట తప్పలేదు. మొత్తంగా పరిశీలిస్తే తొక్కిసలాటకు కారణాల్లో ఆర్సీబీ యాజమాన్యం లోపం కూడా కన్పిస్తోంది. అటు ప్రభుత్వం కూడా అభిమానుల రద్దీని అంచనా వేయడంలో విఫలమై తక్కువ బందోబస్తు ఏర్పాటు చేసింది. 

Also read: Stampede: 100 కోట్ల దావా? బయట జనాలు చస్తుంటే లోపల వేడుకలా? కోహ్లీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News