)
Yashasvi Jaiswal Run Out: వెస్టిండీస్తో జరుగుతోన్న రెండో టెస్టు 2వ రోజున టీమ్ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించలేకపోయాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్తో జరిగిన దారుణమైన తప్పిదం తర్వాత అతను వికెట్ కోల్పోయాడు. 173 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా.. టెస్టుల్లో మూడుసార్లు డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలవాలని యశస్వి జైస్వాల్ ఆశించాడు. కానీ, అనుకోకుండా రనౌట్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు.
రనౌట్ సంఘటన తర్వాత జైస్వాల్, గిల్ వాడీవేడిగా చర్చ జరిగినట్లు కనిపించింది. కానీ, చివరికి బరువెక్కిన గుండెతో యశస్వి జైస్వాల్ పెవీలియన్ బాట పట్టాడు. దీంతో అతని కెరీర్లో మూడో డబుల్ సెంచరీని మిస్ అయినట్లు అయ్యింది.
Shubman Gill's Jealousy towards Yashasvi Jaiswal #INDvWI pic.twitter.com/81tcf8RC5E
— Lokesh Saini (@LokeshVirat18K) October 11, 2025
అంతకుముందు వెస్టిండీస్తో రెండో టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న టీమ్ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 173 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండోరోజు డబుల్ సెంచరీ చేయాలని ఎంతో ఆసక్తితో గ్రౌండ్లోకి వచ్చాడు. కానీ, కెప్టెన్ శుభ్మన్ గిల్ రూపంలో ఆ ఆశలు ఆవిరైనట్లు కనిపిస్తుంది. మరోవైపు యశస్వి జైస్వాల్తో పాటు టీమ్ఇండియా ఫ్యాన్స్ కూడా డబుల్ సెంచరీ మిస్ అయ్యిందని నిరాశ చెందారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook