Vaibhav Suryavanshi: గుర్తుపెట్టుకో నా పేరు వైభవ్ సూర్య వంశీ..14 ఏళ్లకే ఐపీఎల్ లో సెంచరీ బాదిన ఈ చిచ్చర పిడుగు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే

Vaibhav Suryavanshi: అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు.. అద్భుతం జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు.. ఈరోజు అలాంటి అద్భుతమే క్రికెట్ మైదానంలో చోటుచేసుకుంది.  14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ ఈరోజు బౌలర్లను ఉతికి ఆరేశాడు.   ఐపిఎల్ చరిత్రలోనే అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా హిస్టరీ నమోదు చేశాడు.  ఆ విషయానికొస్తే ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడిగా  సెంచరీ కొట్టిన ఘనతను సాధించాడు.

Written by - Bhoomi | Last Updated : Apr 28, 2025, 11:31 PM IST
Vaibhav Suryavanshi: గుర్తుపెట్టుకో నా పేరు వైభవ్ సూర్య వంశీ..14 ఏళ్లకే ఐపీఎల్ లో సెంచరీ బాదిన ఈ చిచ్చర పిడుగు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే

Vaibhav Suryavanshi: క్రికెట్ చరిత్రలో ఒక సంచలనం నమోదయింది. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత తక్కువ వయసు కలిగిన ఆటగాడిగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..  మరో ఘనత సాధించి ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. నేడు (సోమవారం) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన  టి20 మ్యాచ్ లో  చేజింగ్ కోసం  ఓపెనర్ గా రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ  చితక్కొట్టుడు కొట్టాడు. అతని కొట్టుడు వివరించడానికి మాటలు సరిపోవు. బౌలర్లకు దమ్మెత్తనియ్యలేదు.  14 ఏళ్ల కుర్రాడి చేతిలో  ఇంటర్నేషనల్  క్రికెట్కు చెందిన బౌలర్లు సైతం చేతులెత్తేశారు.

 ఒక ఓవర్లో ఏకంగా 30 రన్స్  బాదాడు అంటే అతని బాదుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైభవ సూర్యవంశీ  కేవలం 14 సంవత్సరాల వయసులో  35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యంత వేగవంతమైన సెంచరీ అవడం విశేషం. 14 సంవత్సరాల 23 రోజుల వయస్సులో ఐపిఎల్  టోర్నీలో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ  సొంత గ్రామం బీహార్ రాష్ట్రంలోని సమస్తి పూర్ జిల్లాలోని తాజ్ పూర్.  ఒక మారుమూల పల్లెటూరి నుంచి ఈరోజు ఐపీఎల్ వరకు ఎదిగిన అతడి ప్రస్థానం చాలా వేగవంతంగా దూసుకొచ్చిందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే  అసాధ్యం అనిపించే ఒక టాస్క్ ను వైభవ్ సుసాధ్యం చేసి చూపించాడు. తన టాలెంట్ కు వయసు అడ్డం కాదని నిరూపించాడు.  

Also Read: Patanjali: పతంజలి గులాబీ షర్బత్ : లాభం కోసం కాదు, దేశ సేవ కోసం రూపొందించిన ఈ  షర్బత్  ప్రత్యేకతలు ఇవే  

చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల  వైభవ్ ఎంతో ఆసక్తి కనబరిచేవాడు. పట్టుమని పదేళ్లు వయసు కూడా లేని సమయంలోనే  క్రికెట్ లోకి  ప్రవేశించి  అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సరిగ్గా ఐదేళ్ల క్రితం కరోనా సమయంలో ఇంటి వద్దనే నెట్ వేసి క్రికెట్ ప్రాక్టీస్ చేసిన వైభవ్  ఈరోజు వరల్డ్ క్లాసు బౌలర్లను సైతం ఒక ఆట ఆడుకున్నాడు. 

వైభవ్ 14 సంవత్సరాల వయసులోనే బీహార్ తరఫున రంజీ ట్రోఫీలో కూడా ఆడాడు. అలాగే వైభవ్ గతంలో భారత్ అండర్ 19 జట్టు తరపున ఆడి 58 బంతుల్లో శతకం సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో  గత సంవత్సరం ఐపీఎల్ వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది.

 అయితే ఐపీఎల్ లో మొదటి మ్యాచ్‌లో వైభవ్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.  ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప వయసులో సిక్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం ఇటీవల వైభవ్ ఆటపై ప్రశంసలు కురిపించారు.వైభవ్ ప్రతిభను గుర్తించి బీహార్ సీఎం నితీష్ కుమార్ పురస్కారం అందించారు.

 

 

Also Read: Ather Energy IPO subscription: నేటి నుంచి ప్రారంభం కానున్న ఎథర్ ఎనర్జీ ఐపీవో, ప్రైస్ బ్యాండ్  ధర ఎంత, మినిమం ఎన్ని షేర్లు కొనాలి  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News