AP Rain Alert: మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో నిన్న మొన్నటి వరకు భారీ వర్షాలు కురిసాయి. అయితే ఈ తుపాను బలపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మూలాన పెను ప్రమాదం తప్పింది. తాజాగా బంగళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులతో కూడిన వర్షాలు 9 జిల్లాల్లో పడనున్నాయి.
AP Rains : ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది.
AP Rains: ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
AP Rain Alert: ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల జలమయం అవుతున్నాయి.
AP Rain Alert: APకి రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు యానాం ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది.
Andhra Pradesh Rain Alert: బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఆవర్తనం ప్రభావం క్రమంగా పెరిగే కొద్దీ వాయువ్య దిశలో కదిలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపనుంది.
AP Rains: ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తమిళనాడు మీదుగా, సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP Rain Alert: నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ తమిళనాడు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నట్లు పేర్కొంది.
AP Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు తప్పింది. అయితే ఈ రోజు వాయుగుండంగా మారి తుఫాను మారే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే ఇది వాయువ్య దిశకు కదిలిపోవడంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకు తుపాను గండం తప్పింది.
AP Weather Update: బంగాళాఖాతంలో వాయు గుండం ఏర్పడింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ మధ్య ఉపరితల ఆవర్తనం నెలకొని ఉండటంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద సముద్రం అర కిలో మీటర్ వెనక్కి వెళ్లడంతో సునామీ వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
AP Rains: ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయవ్య దిశగా కదిలి పశ్చిమమధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో రేపటి వరకు వాయుగుండంగా బలపడుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.