Turkey: భారతదేశం, టర్కీ మధ్య ఆర్థిక సంబంధాలు గత కొన్ని దశాబ్దాలుగా బలంగా ఉంది. ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ నాయకత్వంలోని టర్కీ కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్కు మద్దతు ఇస్తూనే ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కూడా టర్కీ బుద్ధి మారలేదు. ఇటీవల భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో కూడా, పాకిస్తాన్ వైపు నుండి టర్కిష్ డ్రోన్లను ఉపయోగించి ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయని వెలుగులోకి వచ్చింది.
Boycott Turkey JNU Suspends MOU: 'ఆపరేషన్ సింధూర్'లో భాగంగా పాకిస్తాన్ పై దాడి చేసినప్పుడు టర్కీ పాకిస్తాన్ కు మద్దతుగా తమ డ్రోన్లను పంపించడంతోపాటు సైనిక పరంగా కూడా సహాయం చేసింది. ఈ నేపథ్యంలో భారత ఏజేన్సీలు కూడా ఇప్పటికే ట్రావెల్ కూడా రద్దు చేశాయి. 'బైకాట్ టర్కీ' ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎన్యూ యూనివర్సిటీ కూడా ఇరు దేశాల మధ్య ఉన్న విద్యాపరమైన ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.