AAP on MP Elections: ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచుతోంది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన రేపుతోంది.
కర్ణాటక ఎగువ భద్ర ప్రాజెక్ట్తో రాయలసీమ ఎడారిగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తప్పవన్నారు. జగన్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Comments On Budget 2023 :కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఏరకంగా చూసినా కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా లేదని.. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర సోమవారం ముగియాల్సి ఉంది. అయితే ఒకరోజు ముందు ఆదివారమే ముగించారు. శ్రీనగర్లోని లాల్ చౌక్లో ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
Revanth Reddy in Republic Day 2023 Celebrations: ఫిరాయింపులు చేసే వారికి ఉరి శిక్ష వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
దళిత, గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పని చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay On Congress: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంపై బండి సంజయ్ స్పందించారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుంది కాంగ్రెస్ నేతల వ్యవహారం అంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు.
BRS MLA Pilot Rohit Reddy: కాంగ్రెస్ నేతలు ముందుగా వాళ్ళ అంతర్గత తగాదాలు తేల్చుకుని, ఆ తరువాత బయటి విషయాలు మాట్లాడితే బాగుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హితవు పలికారు. టిఫిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు బీజేపీకి వత్తాసు పలికినట్లుగానే ఉందని అన్నారు.
Revanth Reddy's Open Letter To CM KCR: కామారెడ్డి మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి ఎక్స్గ్రేషియా కింద కోటి రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్ అని.. ఈ గజదొంగను జైళ్లలో పెట్టాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయితీలన్నీ ఆర్థికంగా నిర్వీర్యమయ్యాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
Congress leader Rahul Gandhi shares how his life partner should be. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనకు కాబోయే జీవిత భాగస్వామిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.