Indian Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ పేరిట.. పీవోజేకేతో పాటు పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ ఉగ్ర శిబిరాల్లో తలదాచుకున్న ఉగ్రవాద పందులు మృత్యు వాత పడ్డాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అంతేకాదు భారత్ తో యుద్ధం నేపథ్యంలో ఫేక్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చింది.
Indian Pakistan War: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ను చావ చితికబాది ఒదిలిపెట్టినా.. పాక్ పాకీ బుద్దీ మారలేదు. సరిహద్దుల్లోని అమాయక ప్రజల ఇళ్లపై డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులు చేస్తూనే ఉంది. వాటిని మన భద్రతా బలగాలు తిప్పికొడుతూనే ఉన్నాయి.
India Pakistan War: భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చీకటి పడటంతో సరిహద్దుల వెంబడ పాకిస్థాన్ కాల్పులను తెగబడుతోంది. పాక్ కాల్పులను భారత్ తిప్పికొడుతోంది.
India Pak War: యుద్దానికి కాలు దువ్విన పాకిస్తాన్ వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. జనావాసాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. యురి సెక్టార్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ అమాయక ప్రజలపై కాల్పులకు తెగపడుతుంది.
India Pak War: యుద్దానికి కాలు దువ్విన పాకిస్తాన్ వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. జనావాసాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. యురి సెక్టార్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ అమాయక ప్రజలపై కాల్పులకు తెగపడుతుంది.
India Pak War: భారత్ -పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక బ్లాక్ అవుట్ తర్వాత కాశ్మీర్ లోయ ప్రశాంతంగా ఉంది. నిన్న సాయంత్రం పాక్ చేసిన మిస్సైల్స్ దాడిని భారత్ ను తిప్పికొట్టింది. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ను ప్రకటించింది కేంద్రం.
Harap Air Defence System: మన దేశంలో జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ దాడిలో అమాయక భారతీయ పౌరులను మట్టు పెట్టిన పాక్ ఉగ్ర మూకలను మన దేశ భద్రత దళాలు వారి దేశంలోనే మట్టుపెట్టాయి. మరోవైపు పాకిస్థాన్ నిన్న మన దేశంలోని పలు నగరాల్లో మిస్సైల్స్ ను ఎక్కు పెట్టింది. వాటిని గగనతలంలోనే తుత్తునియలు చేసింది. ఇంతకీ భారత గగనతలాన్ని రక్షించింది హారప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇంతకీ ఈ హారప్ మిస్సైల్స్ ప్రత్యేకత విషయానికొస్తే..
India Pak War: పహల్గామ్ లోని బైసరన్ లోయలో అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన కొన్ని కుటుంబాలకు చెందిన పురుషులను మతం అడిగి మరి ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే కదా. ఈ దాడికి భారత్ ప్రతిదాడి చేసి పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. మరోవైపు ఈ ఘటనపై పాక్.. భారత్ పై మిస్సల్స్ తో విరుచుకుపడింది. దానికి ప్రతిగా మనం ఎదురు దాడి చేసాము. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన ఓ ఎంపీ ఏడుస్తూ ఓ దేవుడా మా దేశాన్ని కాపాడు అంటున్న వీడియో వైరల్ అవుతోంది.
India - Pakistan: పాకిస్థాన్ మరోసారి బరి తెగించింది. జమ్మూ ఎయిర్పోర్టు లక్ష్యంగా పాక్ డ్రోన్లతో దాడులు నిర్వహించింది. డ్రోన్లను భారత్ తిప్పికొట్టగా.. జమ్మూలో భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇక మోడీ దెబ్బకు పాక్ విలవిల లాడిపోతుంది.
India Vs Pakistan: మంగళవారం అర్ధరాత్రి ఉరుములేని పిడుగులా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడిన భారత దళాలు.. మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో నాలుగు పాకిస్థాన్లో, మిగిలిన ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. మరోవైపు పాక్ మన దేశంపై మిస్సైల్ ఎటాక్ కు గట్టి సమాధానమిచ్చాము. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది.
India Pakistan War: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ లాహోర్లో పేలుళ్లు సంభవిచండంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
India Pakistan War 2025: ఆపరేషన్ సింధూర్ తో ఆగమాగం అవుతున్న పాకిస్తాన్ సరిహద్దులో కవ్వింపులకు దిగుతోంది. ఇప్పటివరకు 15 మంది సామాన్య పౌరులను కాల్చేసింది.
India - Pak War:జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్ ఆర్మీ. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది ఆమాయక పౌరులను పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్ ఆర్మీ. ముఖ్యంగా పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది.
NIA on Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో NIA విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో ఉగ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది.
Pahalgam Terror Attack: ఈ నెల 22న జమ్ము కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26వ మందిని పొట్టనపెట్టుకున్నారు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. ఈ ఘటనను దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చనిపోయిన వారి కోసం దేశ వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అటు విదేశాల్లోని ఎన్నారై లను కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
India - Pak War: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఉగ్రదాడిని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖంచారు. తాజాగా దీనిపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్రరాజ్యం సూచించింది.
India - Pak War: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు ఎపుడు మన దేశంపై టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అయింది. ఇప్పటికే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు సీడీఎస్ తో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.