Operation Sindhu: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు సీజ్ ఫైర్ కు అంగీకారం తెలపాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల్లో చదువు, ఉద్యోగం సహా ఇతర పనులపై ఆ రెండు దేశాలు వెళ్లి చిక్కుకుపోయిన విద్యార్ధులను, భారత పౌరులను భారత్ స్వదేశానికి తీసుకువస్తోంది.
Strait of Hormuz: గత కొన్ని రోజులు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్.. అన్నంత పని చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది హార్ముజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ఎఫెక్ట్ భారత్ పై ఎలా ఉండబోతుంది.
Iran - Israel War: ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. అది ప్రపంచ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్ వార్ లో అమెరికా రంగ ప్రవేశంతో అంతా మారిపోయింది. తాజాగా ఇరాన్ పై అమెరికా నేరుగా ఎటాక్ కు దిగడంతో ఈ యుద్ధం ముదిరి పాగానా పడింది. దీని ఎఫెక్ట్ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎగబాకాడానికి కారణమయ్యాయి.
Operation Sindhu: ఇరాన్లో యుద్ధ వాతావరణంతో అక్కడ చిక్కుకున్న 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిని ఫస్ట్ ప్లైట్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో 90 మంది జమ్ముకశ్మీర్కు చెందినవారు. ఇరాన్లోని ఉర్మియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల తొలి బృందం అర్మేనియా దోహాల మీదుగా ఢిల్లీకి చేరుకుంది.
Iran - Israel War:ఇరాన్కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించడంపై ట్రంప్ స్పందించారు.
Israel Iran War:ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో మూడో ప్రపంచ యుద్ధం దాదాపు మొదలైందనే చెప్పవచ్చు. టెహ్రాన్ లోని న్యూక్లియర్ సైట్స్ పై ఇజ్రాయెల్ తో కలిసి దాడులకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
Israel Iran War: ఇరాన్లోని అణు స్థావరాలే ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. దీనికి తోడు ప్రత్యక్ష యుద్ధంలో దిగేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టెహ్రాన్లోని న్యూక్లియర్ సైట్స్పై ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేయాలని అమెరికా నిర్ణయించినట్లు సమాచారం.
Israel Iran War Airports Closed: ముదురుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గగనతలాలపై కీలక ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ఎయిర్ పోర్టులు మూసివేత చిక్కుపోయిన వేలాది మంది చిక్కుకుపోయారు.