Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. గత నెల 19న మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన హాజరయ్యారు. 22న రాత్రి స్విట్జర్లాండ్లోని అతిపెద్ద నగరం జ్యూరిక్ నుంచి బయలుదేరి అమెరికా వెళ్లారు. 25న మసాచుసెట్స్ రాష్ట్రంలోని హార్వర్డ్ యూనివర్సిటీలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో 21వ శతాబ్దంలో నాయకత్వం అనే కోర్సులో చేరారు.
Revanth Davos Tour: ప్రపంచ నగర ప్రమాణాలతో తెలంగాణలో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక వేదికపై వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను, ఫ్యూచర్ సిటీ సమగ్రాభివృద్ధికి పారిశ్రమిక ప్రణాళిక, మౌలిక సదుపాయాలకల్పన పెట్టుబడులకు అనువుగా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.
Revanth Davos Tour: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సును హైదరాబాద్ లో ప్రతి జులై నెలలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడుల సాధనతో ఒప్పందాలు చేసుకునేందుకే గాకుండా.. రైజింగ్ తెలంగాణ లక్ష్యాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించబోతున్నామని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.