Gold Rates Today: జనవరి 10వ తేదీ శనివారం నాటి బంగారం, వెండి ధరలు ఇన్వెస్టర్లను ఒక్కసారిగా అలర్ట్ చేశాయి. మార్కెట్ను గమనిస్తున్న వారందరికీ ఇది నిజంగా షాక్ ఇచ్చే పరిణామమే అని చెప్పాలి. ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ. 1,41,900 స్థాయికి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,27,550గా నమోదైంది. వెండి ధర కూడా తగ్గేదే లేదన్నట్లు పరుగులు పెట్టింది. ఒక కేజీ వెండి ధర రూ. 2,50,357కి చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ బంగారం, వెండి రెండింటిలోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది.
Trumps Rice Tariff Threat: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. బుర్రలో అప్పుడప్పుడు పురుగు తిరుగుతున్నట్లు ప్రవర్తించే ట్రంప్.. ఈ సారి తీసుకునే నిర్ణయం తెలుగు రాష్ట్రాలకు చెందిన రైస్ ఇండస్ట్రీస్ పై భారీ ఎత్తున ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ వైట్ హౌస్ లో అమెరికన్ రైస్ ఇండస్ట్రీ ప్రతినిధులో సమావేశమయ్యారు. ఈ పరిణామాలే ఇందుకు కారణమని చెబుతున్నారు.
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సుంకాల బెదిరింపులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇటీవల రష్యాతో చమురు వ్యాపారం కొనసాగిస్తే భారత్పై భారీ టారిఫ్లు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్, ఇప్పుడు చైనాపై కన్నేశారు. నవంబర్ 1వ తేదీ లోపు అమెరికాతో న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదరనట్లయితే చైనాపై సుంకాలను 155 శాతం వరకు పెంచుతానని ఆయన కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Crypto Market Crash: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై భారీ టారీఫ్స్ ప్రకటించడంతో క్రిప్టో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. 16లక్షల మంది ట్రేడర్లు బిలియన్ల డాలర్లను కోల్పోవల్సి వచ్చింది. బిట్ కాయిన్, ఈథర్ ధరలు భారీగా పతనం అయ్యాయి. ఈ అనూహ్య పరిమాణంతో మార్కెట్లో తీవ్రభయాందోళన నెలకొంది. భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Crash Pharma Stock Market: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు. ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ బాంబు పేల్చారు. బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో అనేక ఫార్మా కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి.
Trump Tariffs: భారత్ నుంచి దిగుమతులపై అదనంగా 25శాతం సుంకాలను విధిస్తూ అమెరికా అధికారికంగా ఓ పబ్లిక్ నోటీసు జారీ చేసింది. కొత్త సుంకాలు రేపటి నుంచి ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నోటీసు అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసింది. ఆగస్టు 6న సంతకం చేసిన అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులో ఈ సుంకాలు అమలు అవుతాయని పేర్కొంది. నోటీసుకు అనుబంధంగా జాబితా చేసిన విస్త్రుత శ్రేణి భారత ఉత్పత్తులకు ఈ సుంకాలు వర్తిస్తాయి.
Suspension Of All Postal Services: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాన్ని విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా 25 శాతం జరిమానా విధించారు. అయితే ఇప్పుడు ట్రంప్ కు కూడా భారత్ మంచి రిటర్న్ గిఫ్ట్ తో అదిరిపోయే షాకిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Trump Tariffs War on India: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై విధించిన వారిపై ఇప్పుడు అతని స్వదేశంలోను వ్యతిరేకత ఎదురవుతుంది. ఈ అధిక సుంకాల వల్ల అమెరికా ప్రజలకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ఆర్థికవేత్త జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Trump's Tariff Threat : భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడంతో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకున్నట్లయితే అదనంగా పెనాల్టీలువిధిస్తామని, వెంటనే రష్యా ఆయిల్ కొనుగోలు ఆపేయాలని వార్నింగ్ ఇచ్చింది. అయితే రష్యా నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొంటున్న భారత్ ఇప్పుడు ట్రంప్ బెదిరింపులకు భయపడి వాటిని ఆపినట్లయితే భారీగా భారం మోయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం రూ. 96వేల కోట్ల వరకు భారం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా భారత్ గట్టి షాకిచ్చింది. భారత్ పై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ట్రూత్ లో పోస్టులో ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రష్యాతో స్నేహాన్ని భారత్ కొనసాగిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగశాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
Trump Tariffs: అమెరికా వ్యతిరేక విధానాలతో బ్రిక్స్లో చేరే ఏ దేశానికైనా 10శాతం అదనపు టారిఫ్ విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ మేరకు తన సోషల్ హ్యాండిల్ ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు.
Gold Rate: దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈమధ్యే ప్రవేశపెట్టిన కొత్త టారిఫ్స్ తగ్గింపులకు సంబంధించి పలు దేశాలతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే కొన్ని ప్రధాన దేశాలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆయా దేశాలపై విధించిన టారిఫ్స్ ను అమెరికా తగ్గించింది. దీనిలో భాగంగా యూరోపియన్ యూనియన్ తో కూడా వాణిజ్య చర్చలు జరిపేందుకు సిద్ధం అవుతున్న వేళ వాణిజ్య చర్చలు జరిపే గడువు తేదీని అమెరికా పెంచడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గాయి.
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, చిప్ లను మినహాయించారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దిగ్గజ సంస్థలకు డెడ్ లైన్ విధించారు. కంపెనీ కార్యకలాపాలను అమెరికాకు తరలించాలని దిగ్గజ సంస్థలకు ట్రంప్ పిలుపునిచ్చారు.
Gold Price: అమెరికన్ సుంకాల ప్రభావం ఇప్పుడు కమోడిటీ మార్కెట్పై కూడా కనిపిస్తోంది. ప్రపంచ స్థాయిలో ముఖ్యమైనవిగా పరిగణించే బంగారం, ముడి చమురు వంటి ముఖ్యమైన వస్తువుల ధరలలో భారీ తగ్గుదల కనిపిస్తోంది.
Trump Tariff War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, అమెరికా వాణిజ్య విధానంలో వచ్చిన భారీ మార్పు వల్ల తలెత్తే అవకాశాలను అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారతదేశంపై 27% పరస్పర సుంకం ప్రకటన చిక్కులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. . ఆయన అమెరికాతో కూడా మాట్లాడుతారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ ఉత్పత్తులపై 26శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనాపై 34%, యూరోపియన్ యూనియన్పై 20%, జపాన్పై 24% సుంకాలు విధించారు. ఈ సుంకాలు పాక్షికంగా ప్రతీకార చర్య అని ట్రంప్ అన్నారు. వాణిజ్య అడ్డంకులపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
Trump Tariff Bomb: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ బాంబ్ పేల్చేందుకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. దీంతో ప్రపంచ దేశాల్లో వణుకు మొదలైంది. మరికొన్ని గంటల్లోనే ట్రంప్ వీటిపై ప్రకటన చేయనుండగా..తక్షణమే అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఇది అమెరికా విమోచన దినోత్సవం అంటూ పోస్టు చేశారు.
Stock Market: ట్రంప్ సుంకాల దినోత్సవం నాడు స్టాక్ మార్కెట్ బలమైన పెరుగుదలను చూస్తోంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే, రెండు సూచీలు గ్రీన్ జోన్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే 450 పాయింట్లకు పైగా పెరిగింది.
US Tariffs Impact Stocks: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియా కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య పరస్పర సుంకాల విధింపు గురించి ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించనున్నారు. అయితే ట్రంప్ టారిఫ్ లు విధించిన వెంటనే ఈ 50 స్టాక్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అవేంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.