BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ల బిల్లు ఓవర్‌ టూ ఢిల్లీ.. రేపు వెళ్లనున్న తెలంగాణ బృందం

Telangana Leaders Fly To New Delhi For BC Reservation Bill: తెలంగాణ నుంచి బీసీ రిజర్వేషన్ల బిల్లు ఢిల్లీకి మారగా.. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా హస్తిన బాట పట్టనున్నారు. అక్కడ జరిగే ధర్నాలో పాల్గొనడంతోపాటు కేంద్ర పెద్దలను బీసీ ప్రజాప్రతినిధులు కలవనున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2025, 06:23 PM IST
BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ల బిల్లు ఓవర్‌ టూ ఢిల్లీ.. రేపు వెళ్లనున్న తెలంగాణ బృందం

BC Reservation Bill: బీసీ రిజర్వేషన్ల బిల్లు హస్తినకు చేరుకుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తెలంగాణ బృందం ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పేందుకు తెలంగాణ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ఢిల్లీలో చేపట్టిన బీసీ సంఘాల మహాధర్నాకు హాజరవడంతోపాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

Add Zee News as a Preferred Source

Also Read: HCA SRH Dispute: సన్‌రైజర్స్‌ వార్నింగ్‌పై రేవంత్‌ రెడ్డి సీరియస్‌.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని ఏప్రిల్ 2వ తేదీన బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నా చేపట్టనున్నాయి. ఈ మహాధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఇతర మంత్రులు పాల్గొననున్నారు. వారి వెంట బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకరయ్య కూడా వెళ్లనున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు బీసీల ధర్నాలో పాల్గొననున్నారు.

Also Read: Bandi Sanjay: రేవంత్‌ రెడ్డి ఇజ్జత్‌ తీసిన బండి సంజయ్‌.. 'నీ కన్నా కేఏ పాల్‌ నయం'

తెలంగాణ శాసనసభలో ఇటీవల బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చాలని ఏప్రిల్ 2,3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకులను కలవనున్నారు.  తెలంగాణలో చేసిన కుల గణన, సర్వే వివరాలు చెప్పి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ మంత్రుల బృందం కోరనుంది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు ఢిల్లీలో మంత్రులు, ప్రజాప్రతినిధులు బిజీబిజీగా ఉండనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News