TSRTC Employees: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. వివిధ కారణాలతో తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే నియమించిన త్రిసభ్య కమిటీతో పోయిన ఉద్యోగాలు తిరిగి దక్కుతున్నాయి. దశల వారీగా ఉద్యోగులను తిరిగి చేర్చుకునే ప్రక్రియ వేగవంతం కాగా..ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు.. డీఏ పెంపుతోపాటు 8 భారీ కానుకలు
తొలగించబడిన ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చిన్న చిన్న కారణాలతో అన్యాయంగా తొలగించబడిన 500కు పైగా ఆర్టీసీ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించి దశలవారీగా తిరిగి ఉద్యోగాలలో తీసుకుంటోందని ఆర్టీసీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే 130 మందిని ఉద్యోగులు తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని తొలగించబడిన ఆర్టీసీ ఉద్యోగులు దాసరి రాంబాబు, వీరాంజనేయులు,శ్రీనివాస గౌడ్ తెలిపారు.
Also Read: KCR Meeting: 'కేసీఆర్ సభను చూసి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లాగులు తడుపుకుంటోంది'
హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల గోడు విని తమ సమస్యలపై సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన విషయమన్నారు. కొంతమంది పనిగట్టుకొని ప్రభుత్వంపై, సజ్జనార్పై తమ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తొలగించిన ఆర్టీసీ కార్మికులు.. కాంట్రాక్ట్ ఉద్యోగులను విధులలోకి తీసుకోవాలని దాసరి రాంబాబు, వీరాంజనేయులు, శ్రీనివాస గౌడ్ డిమాండ్ చేశారు. పొట్ట చేత పట్టుకొని రోడ్లమీద ఉన్న తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
త్రిసభ్య కమిటీ ఇదే!
ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి గతేడాది డిసెంబర్లో త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ను చైర్మన్గా నియమించగా.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య సభ్యులుగా నియమించారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 300 మంది తొలగించబడిన ఆర్టీసీ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. విధుల్లో మద్యం సేవించడం.. టికెట్ చెల్లింపుల్లో అవకతవకలు ఇచ్చిన కండక్టర్లను.. వివిధ కారణాలతో ఇతర ఉద్యోగులను తొలగించారు. ఇలా తొలగించబడిన ఉద్యోగులు 500 మందికి పైగా ఉన్నారు.
త్వరలో తిరిగి నియామకం
చిన్నచిన్న కారణాలతో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వారి దుస్థితిని తెలుసుకుని ప్రభుత్వం వారికి తిరిగి ఉద్యోగం కల్పించే అవకాశాన్ని త్రిసభ్య కమిటీ ద్వారా పరిశీలిస్తోంది. అలా అకారణంగా ఉద్యోగాలు కోల్పోయిన 130 మందిని ఇప్పటికే తిరిగి విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో మరికొన్ని విడతల్లో ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి