Big twist in Girl jumps from running Hyderabad Mmts train: హైదరబాద్ లో ఇటీవల ఒక యువతి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు రాత్రి పూట ఎంఎంటీఎస్ లో బయలు దేరింది. అయితే.. రాత్రి ట్రైన్ లో ఒక్కతే ఉండటంతో తనపై ఒక వ్యక్తి అత్యాచారయత్నం చేశాడని.. దీంతో రన్నింగ్ ట్రైన్ నుంచి దూకినట్లు సదరు యువతి పోలీసులకు చెప్పింది. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా పెనుసంచలనంగా మారింది.
దీనిపై రాజకీయంగా కూడా రచ్చ జరిగింది. కేంద్ర మంత్రి బండిసంజయ్ ఆదేశాల మేరకు యువతిని ప్రత్యేకంగా యశోద ఆస్పత్రిలో ఉంచి మరీ చికిత్స అందించారు. అయితే..ఈ ఘటనలోయువతి పోలీసులకు బిగ్ షాక్ ఇచ్చింది. యువతి ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దాదాపు.. ఆ ప్రాంతంలోని 250 సీసీకెమెరాలను జల్లెడ పట్టారు.
అదే విధంగా 100 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు . అయిన కూడా ఎలాంటి క్లూ మాత్రం దొరలేదు. దీంతో పోలీసులు యువతిని పలుమార్లు ఈ ఘటనపై మార్చి మార్చి ప్రశ్నలు వేయడంతో.. చివరకు తనపై అలాంటి అఘాయిత్యం ఏంజరగలేదని యువతి నిజం ఒప్పుకుంది. ఈ క్రమంలో యువతి చెప్పింది విని పోలీసులు బిత్తరపోయారు.
ఎంఎంటీఎస్ లో రీల్స్ చేస్తుండగా.. కాలు జారీ కిందపడ్డానని చెప్పింది. ఒకవేళ తాను రీల్స్ చేస్తు పడ్డానని చెబితే.. ఇంట్లో వీపు విమానం మోత మోగిస్తారని భయపడి.. అత్యాచార యత్నం జరిగిందని నాటకం ఆడినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు మొత్తంగా ఇప్పటి వరకు ఈ ఘటనపై పడిన కష్టం అంతా వ్యర్థమని తెలిపోయింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు ప్రస్తుతం యువతిపై సీరియస్ గా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









