Raja Singh: సీఎంతో బ్యాక్ డోర్ మీటింగ్ లకు వెళ్లే వాళ్లను పార్టీ అధ్యక్షులను చేయకండి.. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు..

Raja Singh: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఏక్ నిరంజన్ లా మిగిలాడు రాజా సింగ్. 2018 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్కడిగా గెలిచి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని పార్టీ నేతలపై వీలైనపుడల్లా.. అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా మరోసారి తెలంగాణ బీజేపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 22, 2025, 02:37 PM IST
Raja Singh: సీఎంతో బ్యాక్ డోర్ మీటింగ్ లకు వెళ్లే వాళ్లను పార్టీ అధ్యక్షులను చేయకండి.. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు..

Raja Singh: విభజిత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తరుపున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతగా రాజా సింగ్ సంచలనం రేపారు. తెలంగాణలో మరో నేత ఎవరు హాట్రిక్ విజయాలను నమోదు చేయలేదు. అంతేకాదు హైదరాబాద్ లో బీజేపీ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన తెలంగాణ బీజేపీకి కొత్త  అధ్యక్షుడు వస్తున్నట్టు తెలిపారు. కానీ ఆ అధ్యక్షుడు ఎవరుండాలని ఎవరి ఫైనల్ చేస్తున్నారనేది  స్టేట్ కమిటీ ఆ లేక సెంటర్ కమిటా అని తేలాలని ఉంది.ఒకవేళ స్టేట్ కమిటీ అధ్యక్షుని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు లబ్బర్  స్టాంప్ గానే ఉంటాడు. ఒకవేళ సెంటర్ కమిటీ అధ్యక్షుని డిసైడ్ చేస్తే చాలా మంచిదన్నారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేసేవారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్నారు.

Add Zee News as a Preferred Source

గతంలో ఎవరు అధ్యక్షుడు  అయినా వాళ్లు తమకుంటూ ఓ  గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేసిన విషయాన్ని రాజా సింగ్ ప్రస్తావించారు. అంతేకాదు పార్టీలోని సీనియర్ బీజేపీ కార్యకర్తలకు పనిచేసే నాయకులను పక్కన పెట్టిన విసయాన్ని ప్రస్తావించారు.
తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు గ్రూపులకు పాల్పడితే.. తెలంగాణలో పార్టీకి చాలా నష్టం అవుతుందన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో  బీజేపీలోని మంచి నాయకులు..ఎంపీలు నుంచి  ఎమ్మెల్యేల వరకు అందరికి చేతులు కాళ్లు కట్టి పక్కన పడేసినారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా వచ్చే అధ్యక్షుడికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే .. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం గ్యారంటీ అన్నారు. తెలంగాణ బీజేపీ కొత్త ప్రెసిడెంట్స్ ముఖ్యమంత్రితో బ్యాక్ డోర్ మీటింగ్ లకు పాల్పడకూడదన్నారు. ఓ రకంగా ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని టార్గెట్ గా రాజా సింగ్  ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది.

బిజెపి అంటే హిందుత్వ పార్టీ అంటారు. ధర్మం గురించి పని చేసే అటువంటి కార్యకర్తలని అండగా ఉండాలన్నారు. నేను చెప్పే మాటలు కొంత మందికి కంటగింపుగా ఉంటుంది. ప్రస్తుతం సీనియర్ బీజేపీ నేతలు, కార్యకర్తల మనుసులోని మాటనే నేను చెప్పానన్నారు రాజా సింగ్. కొంతమంది మా నాయకులు అంటున్నారు రాజా సింగ్  అనవసరంగా మీడియా కి మెసేజ్ ఇస్తున్నారు. ఏదైనా ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని సూచనలు ఇస్తున్నారు.  ఆ నాయకులుకి నేను చెప్తున్నాను ఫస్ట్ నేను మన పెద్దలు దృష్టికి నేను తీసుకొని వెళ్తున్నాను.  వాళ్ళు వినకపోతేనే నేను నా మాటలు ప్రజలు ముందు పెడుతున్నానన్నారు. మొత్తంగా పార్టీ అధ్యక్ష స్థానం కోసం పోటీ పడుతున్న నేతల్లో రాజా సింగ్ కూడా ఉన్నారు.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News