)
BJP Raja singh: తెలంగాణ భారతీయ జనతా పార్టీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై చర్యలకు బీజెపీ అధిష్ఠానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముందుగా ఆయనకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. హై కమాండ్ నుంచి రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా పార్టీకి వ్యతిరేకంగా రాజాసింగ్ లక్షణ రేఖ దాటి మారి టూ మచ్ గా మాట్లాడుతున్నారు.తాజాగా రాజాసింగ్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చేలా మాట్లాడటం పార్టీలో కలకలం రేపుతోంది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందే వస్తుంది. అందుకే ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజా సింగ్ పార్టీ లైన్ దాటి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టుగా అర్థమవుతుంది. పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా పలు మార్లు ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా దృష్టికి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ కి క్రమశిక్షణ కింద నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది.ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అతని వివరణ కోరేటువంటి అవకాశం కనబడుతుంది.
నేషనల్ పార్టీ నుంచి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే ఆదేశాలు రావడము జరిగిందనేది సమాచారం. నోటీసులు ఇచ్చిన తర్వాత బిజెపీఎమ్మెల్యే రాజాసింగ్ ఏ రకంగా స్పందిస్తారనే దానిపై కమిటీ ఇప్పటికే రివ్యూ చేసి అతనికి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా రాజాసింగ్ మాట్లాడుతున్నటువంటి తీరు అతను ఇచ్చేటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ పార్టీ అంతర్గతంగా జరిగేటువంటి కొన్ని వ్యవహారాలు సైతం ఏకంగా అతను బహిర్గతంగా తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పట్ల స్టేట్ లో ఉన్నటువంటి పార్టీకి అగౌరవం కలిగించేలా ఉన్నాయనేది కార్యకర్తల అభిప్రాయం.
ఇప్పటికే రాజాసింగ్ బీజేపీ లైన్ దాటి పార్టీలో ఏకపక్షంగా వ్యవహరిస్తుడనేది టాక్. పార్టీ కంటే తాను గొప్ప అనే సందేశం ఇచ్చేలా ఆయన మాటలున్నాయి. ముందుగా నోటీసులు అందజేసి అతను ఇచ్చేటువంటి వివరణను బట్టి పార్టీలో ఉంచాలా లేదా పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలనేది బీజేపీ అధిష్ఠానం ఆలోచనలా ఉంది. గతంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల విషయంలో కూడా రాజాసింగ్ బహిరంగంగా తన మద్దతు తెలియజేయడము. ఆ అంశం కాస్త రెండు పార్టీల మధ్య తీవ్ర చర్చనీ అంశంగా మారింది. అప్పుడు లిక్కర్ కేసులో కవిత తీహార్ జైల్లో ఉన్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో బిజెపీ లోకి విలీనం చేసి రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ మాత్రమే ఆ పార్టీ ఆ టికెట్లను కేటాయించేటువంటి స్థాయికి బిజెపి చేరుకుంది అంటూ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలకు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయనేది టాక్.
అసలు జరగనటువంటి అంశాన్ని ఒక పార్టీ ఎమ్మెల్యే జరిగినట్టుగా కూడా చిత్రీకరించి పార్టీకి ఉల్లంఘనకు పాల్పడ్డాడు అనేది ఆయనపై అభియోగం.కాబట్టిఅతనికి త్వరలో నోటీసులు అందజేసి ఆ నోటీసులపై అతను వివరణ కోరి అనంతరం రాజాసింగ్ పైన బిజెపి తెలంగాణ అధిష్టానం త్వరలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ బిజెపీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తే రాజసింగ్ అంటే నెక్స్ట్ ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశం ఉందనే దానిపై చర్చ జరగుతుంది. ఆయన గతంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజా సింగ్ ని ఒకసారి సస్పెండ్ చేయడం జరిగింది. గోషామహాల్ ఇదే నియోజకవర్గం నుంచి రాజా సింగ్ బిజెపి ఎమ్మెల్యే గా ఉన్నాడు. ముఖ్యంగా కిషన్ రెడ్డి మేకప్ ఆర్టిస్ట్ అంటూ ఆయనపై పార్టీతో సంబంధంలేని వ్యాఖ్యలు చేసి పలుచన అయ్యారు రాజా సింగ్. అంతేకాదు వీలునపుడల్లా..కిషన్ రెడ్డి ఏదో పనుల నిమిత్తం ముఖ్యమంత్రిని కలిసినా.. ఇద్దరి మధ్య దోస్తీ అంటూ వీలు చిక్కినపుడల్లా కిషన్ రెడ్డిని అకారణంగా దూషిస్తూనే వస్తున్నారు రాజా సింగ్. గతంలో పార్టీ కార్యాలయానికి రాకూడదంటూ సస్పెండ్ అయిన అనుభవం రాజా సింగ్ కు ఉంది. బీజేపీలో పార్టీ లైన్ దాటిన వాళ్లు ఎలాంటి నేతలైనా వాళ్లను ఉపేక్షించే ప్రసక్తి ఉండదు.
ఈ లైన్ దాటి వెళ్ళకూడదని తెలిసినప్పటికీ ప్రతిసారి రాజాసింగ్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలను బయట పెడుతూనే ఉన్నారు. ఈ రకంగా పార్టీకి చికాకు తెప్పిస్తున్నారు. కేవలం హైదరాబాద్ కు పరిమితైన తనను తాను రాష్ట్ర నేతగా మలుచుకునే క్రమంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు ఇవ్వాల్సిందిగా పట్టుపడుతున్నట్టు తెలుస్తుంది. తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం లేదనే కసి కూడా ఆయనలో ఉంది. కానీ బీజేపీ హై కమాండ్.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి పనికి వచ్చే నేతలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీకి పరిమితమైన రాజా సింగ్ ను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఈయన తమ పార్టీకి చెందిన కొందరు నేతలను కొజ్జాలతో పోల్చడం కూడా సంచలనంగా మారింది.
ముఖ్యంగా బిజెపి అధిష్టానం రాజాసింగ్ తన నోరుని అదుపులో పెట్టుకోవాలనే సూచనలు చేస్తోంది. ఆయన ఇచ్చే కాంట్రవర్షనల్ స్టేట్ మంట్స్ కారణంగా పార్టీ పరువును బజారున పడుతుంది. రాజాసింగ్ నోటికి బ్రేక్ వేయాలి అంటే తప్పనిసరిగా క్రమశిక్షణ ఉల్లం కింద అతనికి నోటీసులు ఇవ్వాల్సిందే అంటూ మాత్రం అధిష్టానం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నోటీసులు కూడా సిద్ధమయ్యాయి. ఈ రోజు లేదా రేపు రాజాసింగ్ కి వ్యక్తిగతంగా ఈ నోటీసులు అందచేసి మూడురోజులలోపు దీనిపైన వివరణ కోరే అవకాశం ఉంది. అతను ఇచ్చేటువంటి వివరాన్ని బట్టి రాజాసింగ్ ని పార్టీలో ఉంచాలా సస్పెండ్ చేయాలా అనే దానిపై మాత్రం నిర్ణయం తీసుకునేటువంటి
అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.