)
Raja Singh: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత రాజా సింగ్ మరోసారి తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని కూల్చి వేస్తామన్నారు. రాబోయే శ్రీ రామనవమిని పురస్కరించుకుని హిందు బంధువులంతా ఈ సంకల్పం చేయాలని సూచించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని దుర్మార్గ పాలకుడిగా పేరు తెచ్చుకున్న ఔరంగజేబు పేరు మీదున్న
అలాగే ఔరంగజేబు వారసులుగా ఉన్న ఏఐఎంఐఎం అధినేతలైన అసదుద్దీన్, అక్బరుద్దీన్ వంటి వారిని తరిమి వేయాలన్న సంకల్పాన్ని కూడా తీసుకోవాలన్నారు. సామాన్య ముస్లిమ్స్ తో తమకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదన్నారు. కానీ ఇలా మతాన్ని రాజకీయా అవసరాలకు వాడుకుంటున్న ముస్లిమ్స్ పైనే తన పోరాటమన్నారు.
ఈ శ్రీరామనవమికి నిర్వహించే శోభాయాత్రలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హిందువులంతా ఏకమైతే భారత దేశం హిందూ దేశంగా మారుతుందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయానికొస్తే.. తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. విభజిత తెలంగాణ స్టేట్స్ లో భారతీయ జనతా పార్టీ తరుపున వరుసగా మూడు సార్లు శాసనసభ ఎన్నికైన నేతగా రాజా సింగ్ సంచలనం రేపారు. తెలంగాణలో మరో నేత ఎవరు హాట్రిక్ విజయాలను సాధించలేదు. అంతేకాదు హైదరాబాద్ లో బీజేపీ అగ్ర నేతగా ఉన్నారు. రీసెంట్ గా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని స్టేట్ కమిటీ సెలెక్ట్ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. అదే ఒకవేళ సెంటర్ కమిటీ అధ్యక్షుని డిసైడ్ చేస్తే చాలా మంచిదన్నారు. అంతేకాదు తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఏది ఏమైనా దేశం కోసం ధర్మం కోసం పనిచేసేవారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ప్రస్తుతమున్న బీజేపీ నేతలకు చురకలు అందించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe