Breaking: తెలంగాణలో ఉద్భవించనున్న మరో కొత్త పొలిటికల్ పార్టీ..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పొలిటికల్ పార్టీ ఏర్పడబోతుందని తెలుస్తుంది. మాజీ కేంద్రమంత్రి శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 04:51 PM IST
  • తెలంగాణా రాష్ట్రంలో మరో పొలిటికల్ పార్టీ
  • కాంగ్రెస్ నేత డాక్టర్ వినయ్ కుమార్ అధ్యక్షతన కొత్త పార్టీ
  • ఈ రోజు రాజీనామ చేసి కొత్త పార్టీ ప్రకటించే ఆలోచన
Breaking: తెలంగాణలో ఉద్భవించనున్న మరో కొత్త పొలిటికల్ పార్టీ..

New Political Prty in Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), తెలుగు దేశం పార్టీ, ఎంఐఎం (MIM) లతో పాటు దివంగత నేత కూతురు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) కూతురు పెట్టిన వైస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టగా.. తెగపైకి మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని సమాచారం.. 

కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న డాక్టర్ వినయ్ కుమార్ (Dr. Vinay Kumar) అధ్యక్షతన కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ రోజు బంజారా హిల్స్ లో ఉన్న బంజారా ఫంక్షన్ లో తనకు మద్దతు తెలిపే వారితో సమావేశం అయినట్లు తెలుస్తుంది. 

Also Read: Ex & Current Girlfriend Fighting: ప్రేమ ఎంత మధురం.. ప్రియురా"ళ్లు" అంత కఠినం

నిజానికి డాక్టర్ వినయ్ కుమార్ మాజీ కేంద్రమంత్రి శివశంకర్ తనయుడు (Central Minister Shivashankar).. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వినయ్ కుమార్ ఈ రోజు సాయంత్రం తానా పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోటున్నట్లు తెలుస్తుంది. 

కలిసి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందరికి సమానంగా న్యాయం జరగాలని ఉద్దేశంతో కొత్త పార్టీ పెట్టనున్నట్లు సమాచారం. రాజీనామా అనంతరం కొత్త పార్టీ సంబంధించిన విశేషాలు ప్రకటించే అవకాశం ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News