)
Brs ktr slams on cm revanth reddy govt on formula e race case: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్మూలా ఈ రేసింగ్ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గర కేటీఆర్ పై విచారణకు చెందిన అంశం పెండింగ్ లో ఉంది. తాజాగా.. ఆయన దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు చట్టం ప్రకారం ముందుకు వెళ్తున్నారు. మరోవైపు దీనిపై బీఆర్ఎస్ మాత్రం అపోసిషన్ పార్టీలను కుట్రపూరితంగా అణచివేయాలని రేవంత్ సర్కారు ఇలా చేస్తుందని మండిపడుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ భూములు రెగ్యులరైజ్ చేయడానికి 100%, 200% శాతం ఫీజు చెల్లించాలని నిబంధన పెట్టాము
కానీ ఈరోజు రేవంత్ రెడ్డి, AV.రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి లాంటి బడా బాబులకు కేవలం 30% ఫీజు చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని కేబినెట్ సమావేశంలో ఆమోదం… https://t.co/Vnx0cRARSi pic.twitter.com/xGjAY51QCq
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2025
ఎలాంటి అక్రమాలు జరక్కపోయిన కూడా కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తుందని ఇలాంటికేసులు, విచారణలు తమ మనోస్థైర్యంను దెబ్బతీయలేరని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ లు ఇస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్మూల్ ఈ రేసింగ్ కారు వివాదంపై మాట్లాడారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై సంచలన ఆరోపణలు గుప్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అక్రమాలు పాల్పడుతున్నారని ఏకీపారేశారు.
హైదరాబాద్ లో పారిశ్రామిక భూముల రేగులరైజేషన్ పేరుతో ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపిండని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలోనే ఇంత భారీ కుంభకోణం ఎక్కడ కూడా జరగలేదన్నారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న 9,292 ఎకరాల భూమిపై రేవంత్ కన్నేశాడని ఏకీపారేశారు. దీని కోసమే.. కేవలం 30 శాతం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని ఈ పాలసీ ద్వారా కుంభకోణం చేయబోతున్నారని కాంగ్రెస్ సర్కారును ఎండగట్టారు.
గత బీఆర్ఎస్ హయాంలో కనీసం 100% నుండి అత్యధికంగా 200% ఎస్ఆర్ఓ రేట్లు చెల్లించాలని నిర్దేశించినట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కొత్త పాలసీ తెచ్చి అక్రమాలు తెరతీశారన్నారు.
ఇప్పటికే ఈ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులు కొనుగోలు అమ్మకాలకు చెందిన అగ్రిమెంట్లు చేసుకున్నారని, కేబినెట్ లో దీనిపై చర్చించారని కూడా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణులు గుప్పించారు. దీనిలో భాగంగానే.. ఆగమేఘాల మీద కేవలం ఏడు రోజుల్లో దరఖాస్తు, ఏడు రోజుల్లో ఆమోదం, 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ అంటూ హడావిడి చేస్తున్నారని కేటీఆర్ అసలు విషయంను బైటపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన హైదరాబాద్ పారిశ్రామిక భూముల ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ పాలిట గోల్డెన్ ఏటీఎం గా మారిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ భూముల్ని కొన్న వారికి ఫ్యూచర్ లో న్యాయపరమైన చిక్కులు తప్పవంటూ జోస్యం చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు తనకు అరెస్ట్ చేసేంత ధైర్యంలేదని, అదే విధంగా కడియం శ్రీహరిని టెక్నికల్ అంశాలతో తప్పించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు.
మరోవైపు దానం నాగేందర్ ను ఒక వేళ సస్పెండ్ చేస్తే పరువు పోతుందని ఆయనతో రాజీనామా చేయించే విధంగా రేవంత్ సర్కారు పావులు కదుపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి