)
Brs ktr slams on cm revanth reddy govt over musi river floods video: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఈక్రమంలో ఎక్కడ చూసి కూడా రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి.కాలనీల్లో భారీగా వదర నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షానికి మూసి నదీ పొంగి పొర్లింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా వరద నీళ్లువచ్చాయి. దీంతోప్రయాణికులు చిక్కుల్లొ పడ్డారు.
నిన్న రేవంత్ రెడ్డి కావాలనే చెరువు ఖాళీ చేయకుండా.. మూసీ వద్ద ఉన్న ప్రజలు ముంచాడు
క్లౌడ్బరస్ట్ ఉందని తెలిసి కూడా.. మూసీ ప్రజలను ముంచి లక్ష 50 వేల కోట్లు కొల్లగొట్టడానికి, చెరువు ఖాళీ చేయకుండా ఒక్కసారే 15 గేట్లు ఎత్తి రేవంత్ రెడ్డి మొత్తం ముంచేశాడు
మొట్టమొదటిసారి ఇమ్లిబన్ బస్… https://t.co/W0BRodBqK1 pic.twitter.com/3iZQpYWHvr
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2025
జీహెచ్ఎంసీ, హైడ్రా, డిజాస్టర్ సిబ్బంది రంగంలోకి దిగిప్రయాణికుల్ని కాపాడారు. హైదరాబాద్ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక బ్రిడ్జీలు నీళ్లలో మునిగిపోయాయ. మరోవైపు మూసి నదీ వరదలపై కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిని ఏకీపారేశారు. ఇన్నాళ్లుగా మూసి నదీని చూస్తున్నాం..ఇలాంటి వరదల్ని చూడలేదన్నారు.
ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ జంట జలశయాంలను వరదల అలర్ట్ చెప్పగానే సగం వరకు జలశయాల్ని ఖాళీ చేసి ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకొవాలన్నారు. కానీ రేవంత్ రెడ్డి కావాలని పట్టించుకొకుండా.. ఒక్కసారిగా మూసీ గేట్లు ఎత్తి వేయడంతో వరద నీళ్లు భారీగా రావడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ లో వచ్చి చేరిందన్నారు.
మరోవైపు..రేవంత్ కావాలని మూసీ పేరిట లూటీ చేసేందుకు వరద నీళ్లలో ప్రజల ఇళ్లు మునిగిపోయేలా చేశాడన్నారు. అంతేకాకుండా... మొండితనంతో మూసీపై ముందుకు వెళ్లాలని ఈ విధంగా కుట్రలు చేశారన్నారు. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి కుట్ర అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే విధంగా.. స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడారు.
కొడంగల్ ప్రజల జోష్ చూసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ లో పోటీ చేయడంటూ సెటైర్ లు వేశారు.
కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని .. ఎంత జల్దీగా ఇంటికి పంపాలని ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు సీఎంగా తిరుపతి రెడ్డి అధికారం చలాయిస్తున్నారన్నారు.
తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ కూడా కాదు ఎస్పీలు, కలెక్టర్లు వంగి, వంగి దండాలు పెడుతున్నారన్నారు. జేబులో కత్తెరలు పట్టుకుని రేవంత్ రెడ్డి సోదరులు తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పంచినట్లు బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డును ఇంటింటికి పంపిస్తుందన్నారు..
బాకీ కార్డు బీఆర్ఎస్ కు బ్రహ్మస్త్రమన్నారు. రేవంత్ రెడ్డి ఎంత మోడగాడో కొడంగల్ ప్రజలకు తెలుసన్నారు. రాజకీయ జన్మనిచ్చిన కొడంగల్ భూముల్లో తొండలు గుడ్లు పెట్టవంటూ ఎద్దేవా చేశారు. కొడంగల్ ప్రజలు భిక్ష పెడితే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయ్యావని పైర్ అయ్యారు.
నువ్వు రాజువు,చక్రవర్తివి కాదంటూ, రేవంత్ రెడ్డిలాంటి వాళ్ళు అడ్రస్ లేకుండా కొట్టుకుపోయారని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు,కొడంగల్ ఒక ఎత్తుఅన్నారు. ముఖ్యంగా.. కొడంగల్ లో జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగొట్టాలన్నారు. కొడంగల్ లో గట్టిగా గుద్దితే ఢిల్లీలో సౌండ్ వస్తుందని కేటీఆర్అన్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్లను రేవంత్ రెడ్డి తన తమ్ముళ్లకు పంచారంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి