)
Brs leader Jagadish reddy counter to ap deputy cm Pawan kalyan: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా పార్టీలు వేరు అయినన సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఎంతో ప్రేమతో, ఒకరితో మరోకరు క్లోజ్ గా ఉన్న వీడియోలు వైరల్ గా మారాయి . మరోవైపు గురు, శిష్యులు ఒకచోటకు వచ్చారని ప్రచారం జరిగింది. దీంతో ఇద్దరు సీఎంలు కాస్త నెట్టింట ట్రెండింగ్ గా మారారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లా రాజోలులో 'పల్లె పండుగ 2.0' కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చని కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని సెటైర్ లు వేశారు. ఇక్కడి కొబ్బరి చెట్ల పచ్చదనాన్ని చూశాక వారికి ప్రత్యేక రాష్ట్రం ఆలోచన వచ్చిందేమో అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో పవన్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారంగా మారాయి. దీనిపై తాజాగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాన్ వి తెలివితక్కువ మాటలని, మెదడుకు పనిచెప్పకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "తమ దిష్టి వాళ్లకు తగలడం కాదు, ఇన్నేళ్లుగా వాళ్ల దిష్టే మా తెలంగాణకు, హైదరాబాద్కు తగిలిందని జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతిరోజూ వందలాది మంది ఏపీ నుంచే హైదరాబాద్కు వస్తున్నారన్నారు.
కానీ ఎవరు కూడా ఏపీకి పొవట్లేదన్నారు. ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే, ఒక దిష్టిబొమ్మ పెట్టుకోవాలని, దాన్ని తామేమీ ఆపలేదని పంచ్ లు వేశారు. ఇలాంటి వాళ్లు సీఎంలు, డిప్యూటీ సీఎంలు అవుతున్నారంటూ పవన్ పై ఖతర్నాక్ సెటైర్ లు వేశారు. ప్రస్తుతం జగదీశ్ రెడ్డి తాజా కౌంటర్ లతో రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook