MLC Kavitha: నెమళ్లు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.. హెచ్‌సీయూ వివాదంపై మండిపడిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

kavitha on hcu controversy: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్‌సీయూ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం రేవంత్ నోరులేనీజీవాలు ఉసురుపోసుకుంటున్నాడన్నారు.  నెమళ్లు అరుస్తుంటే.. కన్నీళ్లు వస్తుందన్నారు.ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కారుపై కవిత నిప్పులు చెరిగారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 4, 2025, 07:30 PM IST
  • హెచ్ సీయూ పై మండిపడిన కవిత..
  • జంతువుల కన్నీళ్లు చూస్తున్నాడని వ్యాఖ్యలు..
MLC Kavitha: నెమళ్లు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.. హెచ్‌సీయూ వివాదంపై మండిపడిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

Brs mlc kalvakuntla Kavitha fires on cm revanth reddy: తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ హెచ్‌సీయూ భూముల వివాదం కాకరేపుతుంది. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రార్ తో దీనిపైన నివేదిక తెప్పించుకుని, రేవంత్ కు మొట్టికాయలు వేసింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ సీఎం రేవంత్ మనుషుల్నే కాదు.. నోరులేనీ జీవాల ప్రాణాలు కూడా తీస్తున్నాడని మండిపడ్డారు.  400 ఎకరాల్లో ఉన్న పచ్చదనాన్ని పూర్తిగా నాశనం చేసే కుట్రలకు తెరలేపారన్నారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో దాశరథి శత ఉత్సవాల్లో భాగంగా "ఆ చల్లని సముద్ర గర్భం" దృశ్యగీతాన్ని తెలంగాణ జాగృతి రూపోందించింది. ఈ దృశ్యగీతం ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా.. కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న ప్రకృతి విధ్వంసం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెమళ్ళు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు.  లేళ్లకు, అనేక మూగజీవాలకు సీఎం రేవంత్  నిలువ నీడ లేకుండా  చేస్తున్నారన్నారు. 

చెట్లను నరికి ప్రకృతితో యుద్ధం చేస్తున్నారు.. పర్యావరణ హణనానికి  పాల్పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కేసీఆర్ గారి హయాంలో తెలంగాణలో అడవులు 7.7 శాతం  పెరిగాయని.. అదే విధంగా హైదరాబాద్ కు గ్రీన్ ఎన్నిరాన్ మెంట్ అవార్డు సైతం వచ్చిందని గుర్తు చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని..  చెట్లను నరికేసే పరిపాలన అంటూ సెటైర్ లు వేశారు. తెలంగాణ నేల మీద ఇప్పుడు మరో ఉద్యమం జరుగుతుందన్నారు. రేవంత్ ఎట్టిపరిస్థితుల్లో హెచ్సీయూ వివాదంపై వెనక్కు వెళ్లాల్సిందేనంటూ మండిపడ్డారు.

Read more: Deer Injured in HCU Video: హెచ్‌సీయూలో తీవ్రంగా గాయపడ్డ జింక.. సీఎం రేవంత్‌పై మండిపడుతున్న విద్యార్థులు.. వీడియో వైరల్..

నిజాం రాజు ఎన్ని హింసలు పెట్టినా దాశరథి తెలంగాణ వాదాన్ని వదలలేదని అన్నారు.  ప్రజా ఉద్యమంలో పాల్పంచుకున్న గొప్ప వ్యక్తి దాశరథి  అని.. ఆయన రచనలు.. తెలంగాణ ఉద్యమానికి దాశరథి రచనలు స్ఫూర్తినిచ్చాయన్నారు. దాశరథి స్పూర్తిగా ఉద్యమంలో ముందుకు వెళ్తామన్నారు. రేవంత్ కు పాలన మీద అస్సలు సోయిలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News