BRS Party Success: బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం.. బీఆర్‌ఎస్‌ పార్టీ సంబరం

Harish Rao And K Kavitha Welcomes On Banakacherla Project Central Water Commission: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు రద్దు చేయడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు స్పందించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 30, 2025, 10:19 PM IST
BRS Party Success: బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం.. బీఆర్‌ఎస్‌ పార్టీ సంబరం

  Central Water Commission: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు రద్దు చేయడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ హర్ష వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నాట్లు ఆ పార్టీ ప్రకటించింది. 'ఇది బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం విజయం.. తెలంగాణ ప్రజల విజయంగా అభివర్ణించారు.

Add Zee News as a Preferred Source

Also Read: Banakacherla Project: చంద్రబాబుకు భారీ దెబ్బ.. బనకచర్లపై కేంద్రం అభ్యంతరం

ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు
'బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలుపుతున్నాం. జై తెలంగాణ' అని ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు పోస్టు చేశారు.

Also Read: Raja Singh Resign: తెలంగాణ బీజేపీలో సంక్షోభం.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ రాజీనామా

గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి నిరాకరణ హర్షణీయంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 200 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా, పెన్నా బేసిన్‌లకు తరలించేందుకు చేపట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించడం హర్షణీయం'  అని ఎక్స్‌ వేదికగా కవిత పోస్టు చేశారు.

'ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ 33వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ పార్టీలు సాధించిన విజయం. చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణ జల పిడీకి ద్వారాలు తెరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయాలి. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపై వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. గోదావరిలో తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 968 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే వరకు గోదావరి -బనకచర్ల ప్రాజెక్టు పట్టాలెక్కకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి' అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News