)
Cabinet Post To Komatireddy: తెలంగాణలో కేబినెట్ విస్తరణపై మళ్లీ ఊహగానాలు వినిపిస్తున్నాయి..! డిసెంబర్ నెలతో రెండు మంత్రి పదవులను భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది..! ఈసారి విస్తరణలో ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవులు దక్కబోతున్నాయా..! మరో ముగ్గురు మంత్రులను తప్పించి సీనియర్లకు చాన్స్ ఇవ్వబోతున్నారా..! ఇక హోంశాఖను కొత్తవారికి ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారా..! మరి హోంమంత్రి రేసులో ఉన్న ఈ నేతలెవరు..!
తెలంగాణ కేబినెట్ లో భారీగా మార్పులకు అవకాశం కనిపిస్తోంది. ముగ్గురు నలుగురు మంత్రులను తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత పూర్తిస్థాయిలో పట్టు బిగించాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఖాళీగా ఉన్న రెండు స్థానాలతోపాటు కేబినెట్ను రీషెఫిల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్ లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులను భర్తీ చేసి పూర్తిస్థాయి కేబినెట్ తో పాలనను మరింత ముందుకు సాగించాలనే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారట. అందుకే త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేబినెట్ భర్తీ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరపుతారని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం కేబినెట్ లో చోటు కోసం చాలామంది నేతలు ఎదురు చూస్తున్నారు. ఇందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఒకరు. ఆయనకు గతంలోనూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని భరోసా ఇచ్చింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఆయనకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అప్పడప్పుడు రేవంత్ రెడ్డితో పాటు. ఇతర నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దాంతో రాజ్ గోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసారి కేబినెట్లో ఛాన్స్ దక్కనుందని సమాచారం. కానీ మంత్రి కోమటిరెడ్డి పోస్టును రాజ్ గోపాల్ రెడ్డికి ఇచ్చేసి.. మంత్రి సేవలను పార్టీ కోసం వాడుకుంటారని తెలుస్తోంది. అయితే వెంకట్ రెడ్డి మంత్రి పదవి నుంచి తప్పుకుని.. పార్టీ కోసం పనిచేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మరో మంత్రి పదవిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఇస్తారని తెలుస్తోంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో ప్రభుత్వం మైలేజీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. దీనికి అదనంగా మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి అప్పగించే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందని తెలుస్తోంది. అయితే టీపీసీసీ చీఫ్ పదవిని మధుయాష్కీ గౌడ్కు అప్పగించే ఆలోచన చేస్తున్నారట. గతంలో మధుయాష్కీ పార్టీ కోసం కష్టపడ్డారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పదవి లేదు. దాంతో ఆయనకు టీపీసీసీ అప్పగిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మరోవైపు మంత్రివర్గంలోనూ భారీగా మార్పులు చేస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతమున్న మంత్రుల్లో ముగ్గురిని తప్పిస్తారని టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారని అంటున్నారు. అక్కడ పార్టీ హైకమాండ్ పెద్దలతో చర్చించి ఫైనల్ చేస్తారని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో కొందరు మంత్రుల వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. కొందరు మంత్రులు నిత్యం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారట. దాంతో వారి వ్యవహారంపై ఇప్పటికే పలు నివేదికలు పార్టీ హైకమాండ్ కు చేరాయట. వారికి ఇలాగే కంటిన్యూ చేస్తే.. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పార్టీ పెద్దలు సైతం డిసైడ్ అయ్యారట. అందుకే వారిని తప్పించి.. వారి స్థానంలో కొత్తగా మరికొందరికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా అవకాశం దక్కే వారిలో విజయశాంతి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విజయశాంతికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ కూడా ఉంది. దాంతో ఆమెకు త్వరలో జరిగే విస్తరణలో మినిస్ట్రీ ఖాయమని అంటున్నారు. దాంతో అందరి కన్ను ఇప్పుడు హోంమంత్రిత్వ శాఖ పైనే ఉంది... ఈ రేసులో విజయశాంతి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook