)
Chevella Bus Accident PM Modi Reacts: రంగారెడ్డి మీర్జాగూడలోని బస్సు ప్రమాదంలో ఇప్పటికీ 25 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. అయితే మీర్జాపూర్ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి రూ. 2 లక్షలు, రూ.50 వేలు ప్రకటించారు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2…
— PMO India (@PMOIndia) November 3, 2025
సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మీర్జాగూడ బస్సు ప్రమాదం పై స్పందించారు. ఈ ఘటనపై ప్రయాణికుల మృతి తీవ్రంగా కలిసి వేసిందని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక మృతుల కుటుంబాలకు పవన్ సైతం సానుభూతి ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) November 3, 2025
ముగ్గురు అక్కాచెల్లెళ్ళు..
ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తాండూర్కు చెందిన ఎల్లయ్య గౌడ్కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్, సాయి ప్రియా డిగ్రీ థర్డ్ ఇయర్, తనుషా ఎంబీఏ చదువుతున్నారు. ఇటీవల బంధువుల పెళ్లికి వెళ్లి సొంత ఊరుకు వచ్చారు. అయితే తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ బస్సు ప్రమాదం జరిగి దుర్మరణం చెందారు.
రూ.7 లక్షలు ప్రకటన..
మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొన్నం ప్రభాకర్ ఐదు లక్షలు ప్రకటించారు. ఇక ఆర్టీసీ తరఫున మరో రెండు లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు. మొత్తంగా మృతులకు రూ.7 లక్షలు, గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షలు చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ఇక ప్రమాదంపై వెంటనే విచారణ కూడా ఆదేశిస్తామని ప్రకటించారు.
పర్యావరణ ప్రేమికుల వల్లే..
పర్యావరణ ప్రేమికుల వల్లే రోడ్డు విస్తరణ ఆగిపోయిందని స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రోడ్డు చిన్నగా ఉండటం వల్లే తరచూ ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు విస్తరిస్తే చెట్లు నాశనం అవుతాయని కొందరు పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లారు. దీంతో పనులు ఆగిపోయాయని వాళ్ళు వాపోయారు. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించారని కోరుతున్నారు.
మీర్జాపూర్ బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 9912919545, 9440854433 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రమాదంలో ఇప్పటికే 25 మరణించారు మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళు ఎక్కువ తాండూరు, చేవెళ్ల వాసులు అని సమాచారం. ఇక స్థానికంగా ఉన్న వాళ్ళు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే యాదయ్య కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాండూరు డిపో నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరిన బస్సు.. వయా వికారాబాద్ తో దాదాపు 70 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఉదయం 6:20 గంటల సమయంలో మీర్జాగూడలో టిప్పర్, బస్సు ఢీకొన్నట్టు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయంTwitter, Facebook