CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మరో సంచలనం.. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..

Telangana Assembly session: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీతో తీర్మానంను ప్రవేశపెట్టారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 27, 2025, 02:38 PM IST
  • సీఎం రేవంత్ మరో కీలకనిర్ణయం..
  • డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు..
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మరో సంచలనం.. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..

cm revanth reddy on delimitation controversy:  ప్రస్తుతం దేశ మంతట కూడా నియోజకవర్గాల పునర్విభజన తీర్మానంపై రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ దీని వల్ల తీవ్రంగా నష్టపోతాయని రాష్ట్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  శాసనసభలో నియోజకవర్గాల పునర్విభజనపై తీర్మానంను సీఎం రేవంత్ ప్రవేశపెట్టారు. 

Add Zee News as a Preferred Source

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపుపై చర్చ జరుపుతామన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీని వల్ల సౌత్ స్టేట్స్ చాలా నష్టాపోతాయన్నారు. అందుకే గతంలో ఇందిరా గాంధీ.. డీలిమిటేషన్ కు అంగీకరించలేదన్నారు.

ఇప్పుడు నియోజక వర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చకు రావడంతో దక్షిణాదిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా అందరితో కలిసి కేంద్రానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయన్నారు. ఒక వేళ జనాభా ప్రాతిపాదక క్రైటీరియాగా తీసుకుంటే.. చాలా వరకు సౌత్ స్టేట్స్ లు నష్టపోతాయన్నారు. ఇదే జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 శాతం 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more: Lady Aghori: అఘోరీ నా బుగ్గలు కొరికి.. ప్రైవేటు పార్ట్‌పై అలా చేసింది..!.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్షిణి సోదరుడు..

దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం వినియోగించుకుంటుందన్నారు. ఈ విషయంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కలిసి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు. అందుకే ఇవాళ సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News