
Telangana Budget Highlights: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు తీవ్రగా తప్పుబడుతున్నారు. మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారితోపాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దేశపతి శ్రీనివాస్, శేరి సుభాష్, ఎల్ రమణ బడ్జెట్పై విమర్శలు చేశారు. ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అంటూ ఒక్కమాటలో ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు.
మండలిలోని మీడియా లాబీలో కవిత మాట్లాడుతూ.. 'ఈ బడ్జెట్ ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ. ప్రభుత్వం రూ.30 వేల కోట్లు అప్పు కట్టామని చెప్పారు. రూ.లక్ష 40 వేల కోట్లు కట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. అంతా అబద్ధమని తేలిపోయింది' అని ప్రకటించారు. 'కేసీఆర్ అప్పులు చేశారు అని పదే పదే అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నుంచి కేసీఆర్ రూ.4.37 లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పారు. బయటనేమో రూ.7 లక్షల కోట్లు అని ప్రచారం చేస్తున్నారు' అని ఎమ్మెల్సీ కవిత వివరించారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.లక్ష 58 వేల కోట్లు అని రేవంత్ రెడ్డి సభలో చెప్పాడు. ప్రభుత్వం చెప్పింది అబద్దాలు అని తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ ద్వారా తేలింది' అని ఎమ్మెల్సీ కవిత వివరించారు. 'బడ్జెట్లో పరనింద ఆత్మస్తుతి తప్ప ఏం లేదు' అని మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనచారి తెలిపారు. 'పరిపాలన చేతగాక పలాయనవాదం ఎంచుకుంది. తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజల సామాజిక న్యాయం లేదు స్పష్టంగా కనిపిస్తోంది' అని విమర్శించారు.
'బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం అయింది. ఆ పాలన కొనసాగించడం చేతగాక బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం ఖండిస్తున్నాం. అన్ని రంగాల ప్రజల ఆశలు మీద నీళ్లు చల్లిన బడ్జెట్' అని మధుసూదన చారి విమర్శలు చేశారు. 'బీసీలకు సంబంధించి ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లు చెబుతూ గతేడాది రూ.9 వేల కోట్లు ఇప్పుడు రూ.11 వేల కోట్లు అని మాట తప్పారు' అని ఆరోపించారు. తెలంగాణకు చక్కటి భవిష్యత్ లేదు ఆందోళన కలిగిస్తోందని మధుసూదన చారి పేర్కొన్నారు.
'గాలిమాటల ద్వారా గాలి మేడలు కట్టిన బడ్జెట్ ఇది. అంచనాలన్ని అవాస్తవాలు' అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. '420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చి అనేక సభల్లో ఊదరగొట్టారు చేతగాని పరిపాలనకు ఈ బడ్జెట్ నిదర్శనం' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎల్ రమణ తెలిపారు. 'బీసీలను దగా చేసే బడ్జెట్. బతుకమ్మ చీరలకు ఆర్దర్స్ ఇవ్వలేదు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు' అని మండిపడ్డారు. 'అమలు కానీ హామీలు ఇచ్చారు బడ్జెట్లో ఆరు గ్యారంటీల ఊసేలేదు. రాష్ట్ర రైతులను మోసం చేసే బడ్జెట్' అని బడ్జెట్ను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తప్పుబట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి