
Another PUBG Death: ఆన్లైన్ ఆటలు ఎంత ప్రమాదకరమో మరో సంఘటన చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన పబ్జీ గేమ్ మరో ప్రాణాన్ని తీసుకుంది. గంటలు గంటల కొద్దీ పబ్జీ ఆడుతున్న విద్యార్థి.. తిండీ తిప్పలు మానేశాడు. పబ్జీ కోసం చదువును పక్కన పడేశాడు. ఇది చూసిన తల్లిదండ్రులు నచ్చజెప్పారు.. బతిమిలాడారు. అయినా పబ్జీని వదలకపోవడంతో అదేదో జబ్బు అనుకుని కుటుంబసభ్యులు వైద్యులకు చూపించారు. కానీ మారకపోవడంతో తల్లిదండ్రులు కొన్ని రోజులు ఫోన్ దూరంగా ఉంచారు. దీంతో మనస్తాపానికి లోనయిన విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోశ్, సాయిప్రజ దంపతులు కొంతకాలంగా భైంసాలోని ఆనంద నగర్ కాలనీలో నివసిస్తున్నారు. స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్నారు. వీరికి కుమారుడు బేతి రిశేంద్ర, కుమార్తె ఉన్నారు. కుమారుడు హైదరాబాద్లో తొమ్మిదో తరగతి పూర్తి చేసుకున్నాడు. కొంతకాలంగా రిశేంద్ర పబ్జీకి బానిసయ్యాడు. పదో తరగతిలో చేరాల్సి ఉండగా పబ్జీ గేమ్ కారణంగా చదువు మానేశాడు. ఎంత చెప్పినా పబ్జీ గేమ్ను వదలకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తలలు పట్టుకున్నారు. రోజుకు పది గంటలకుపైగా ఆడుతుండడంతో తల్లిదండ్రులు ఇది వ్యాధిగా భావించి.. న్యూరో స్పెషలిస్ట్, సైక్రియాటిస్ట్కి రిశేంద్రను చూపించారు. అయితే వైద్యులతో రిశేంద్ర వాగ్వాదానికి దిగి వారితో దురుసుగా ప్రవర్తించాడు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో తల్లిదండ్రులు మూడు రోజులుగా సెల్ఫోన్ ఇవ్వడం లేదు.
రెండు రోజులు ముభావంగా ఉన్న రిశేంద్ర మూడో రోజు ఇంట్లో ఎవరూ లేని సమయలో ప్రాణాలు తీసుకున్నాడు. ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఫిర్యాదు మేరకు బైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం కాగా.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.