Hyderabad Water: హైదరాబాద్‌లో డేంజర్‌ బెల్స్‌.. తాగునీటి కష్టాలతో నగరవాసులు విలవిల

Water Supply Disrupt In Hyderabad Ex Minister Harish Rao Slams To Govt: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఏర్పడగా.. నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు తాగునీరు అందించాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 25, 2025, 03:29 PM IST
Hyderabad Water: హైదరాబాద్‌లో డేంజర్‌ బెల్స్‌.. తాగునీటి కష్టాలతో నగరవాసులు విలవిల

Hyderabad Water Supply: వేసవి రాకముందే తెలంగాణలో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. రాష్టవ్యాప్తంగా భూగర్భ జలాలు పడిపోవడంతో ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించకపోగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు హరీశ్‌ రావు స్పందిస్తూ ప్రభుత్వంపై విరుకుపడ్డారు.

Add Zee News as a Preferred Source

Also Read: Holiday: గుడ్‌న్యూస్‌.. ఎల్లుండి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు సెలవు

హైదరాబాద్‌లో తాగునీటి సమస్యపై 'ఎక్స్‌' వేదికగా స్పందించిన హరీశ్‌ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'హైదరాబాద్‌లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వేసవి రాకముందే బోర్లు  ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. ప్రజలు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి వాటర్ ట్యాంకర్లను తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది' అని మాజీమంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నాటి సీఎం కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌లో ఇలాంటి తాగునీటి సంక్షోభం లేదని గుర్తుచేశారు.

Also Read: DK Aruna: 'ఎన్నికల్లో ఇచ్చిన 420 హమీలను అమలు చేయడంలో రేవంత్‌ రెడ్డి విఫలం'

'కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదికే పరిస్థితి  విషమించింది. తెలంగాణలో భూగర్భజలాలు 2.88 బిలియన్ క్యూబిక్ మీటర్లు అడుగంటిపోయాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దేశంలోనే భూగర్భ జలాలు భారీగా క్షీణించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. హైదరాబాద్‌లో 15 శాతం అదనంగా వర్షపాతం నమోదైనా భూగర్భజలాలు 1.33 మీటర్లు తగ్గాయి. కూకట్‌పల్లిలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ భూగర్భ జలమట్టం ఏకంగా 25.90 మీటర్ల లోతుకు పడిపోయింది' అని హరీశ్‌ రావు వెల్లడించారు.

'ఇప్పటికే నిత్యావసరాల ధరలతో విలవిలలాడుతున్న సామాన్యులు నీటి ట్యాంకర్ల కోసం రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గొంతు తడుపుకోడానికి కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వలేకపోతున్న  కాంగ్రెస్ ప్రభుత్వం తమది ప్రజాపాలన అని ఊదరగొట్టుకోవడం సిగ్గుచేటు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. 

'బీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్‌ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందింది. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించడంతో ఎండాకాలంలో చెరువులు మత్తడులు దుంకాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెరువులు ఎండిపోతుంటే.. భూగర్భజలాలు పడిపోతున్నాయి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రచారంలోనే మునిగిపోయిందని మండిపడ్డారు. పాలనపై శ్రద్ధ పెట్టకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలతో బిజీగా ఉందని విమర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News