)
Heavy Rains In Telangana: తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాల్లో పరిస్థితి భయానకంగా మారింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వరద మొత్తం జనావాసాలను చుట్టుముట్టడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు వరదలో చిక్కుకున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం రంగంలోకి దిగి బాధితులను ఆదుకునేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం పని చేయడానికి వెళ్లి కార్మికులు చిక్కుకుపోయారు. జలదిగ్బంధంలో చిక్కుకుని అర్థనాదాలు చేస్తుండడంతో వెంటనే రంగంలోకి అధికారులు దిగారు. నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్దకు సబ్ కలెక్టర్ కిరణ్మయి బయలుదేరారు. హెలికాప్టర్ రప్పించి వారి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
రాజంపేట మండలంలో భారీ వర్షానికి నీట మునిగిన పలు తండాలు. నడిమితండా, షేర్ శంకర్ తండా, ఎల్లాపూర్ తండా, లేత మామిడి తండా, గుడి తండాల్లో పరిస్థితి భయాందోళనగా మారింది. వాగు వరదలో పశువులు కొట్టుకుపోగా.. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ప్రభుత్వ అధికారుల సాయం కోసం తండావాసులు ఎదురుచూస్తున్నారు. భారీ వర్షాలతో రాజంపేట- మెదక్ మధ్య రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.
కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా బిక్నూర్ -తలమడ్ల మధ్యలో రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. పట్టాల కింద నుంచి వరద పోటెత్తడంతో పట్టాలు ప్రమాదకరంగా మారాయి. ఈ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు మరమ్మత్తు చేపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.