)
Ex dsp Nalini fires on revanth reddy govt: మాజీ డీఎస్పీ నళిని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో తన ఉద్యోగాన్ని వదిలేసి, ఉద్యమంలో పాల్గొంది. ఉద్యమ సమయంలో అనేక లాఠీ దెబ్బలతో తీవ్రంగా గాయాలపాలైంది. ఆ తర్వాత ఆమె అనేక విధాలుగా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అయిన కూడా ఆమె పూర్తిగా కోలుకోలేక పోయారు.
గతంలో సీఎం రేవంత్ రెడ్డిమరోసారి నళినికి పోస్టింగ్ ఇస్తామంటూ ఆఫన్ చేయగా.. తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నళిని సున్నితంగా తిరస్కరించింది. ఈ క్రమంలో తాజాగా.. నళిని సోషల్ మీడియా వేదికగా తాను ఇక బతకలేనని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని భావించినప్పటికీ.. ప్రస్తుతం తన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల గురించి వివరిస్తూ తన ఆఖరి కోరికలను ఆమె ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలియజేశారు.
ఒక అధికారిణి గా,ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవిక గా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతుందంటూ ఎమోషనల్ అయ్యింది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజుల నుంచి చాలా సీరియస్ గా ఉందని, ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్లు చెప్పింది. గత మూడు రోజుల నుండి కనీసం నిద్రకూడాలేదని రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నానని రాసుకొచ్చింది.
ఎనిమిదేండ్ల క్రితం సోకిన Ruematoid arthritis అనే విలక్షణ కీళ్ల జబ్బు .. బ్లడ్, బోన్ క్యాన్సర్ లు.. గత రెండు నెలలుగా టైపాయిడ్ , డెంగ్యూ,చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరిందని చెప్పుకొచ్చారు. కనకణం పేలిపోతున్నట్లు , ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి. తట్టుకోలేక పోతున్నాను.
2018 లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పుడు ఇలాంటి స్థితి యే ఏర్పడ్డపుడు,మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగుచేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు.
25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయిందన్నారు. తాను ఫార్మసిస్టు నని, అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసని రాసుకొచ్చారు.
ప్రస్తుతం.. 30 లోపు ఉండాల్సిన RA ఫ్యాక్టర్ అత్యధికంగా 900 కు చేరినా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ, యోగ, ధ్యానం, వేదాధ్యయనం,యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది.
దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయన్నారు. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి ఏర్పడిందని, వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయి కి చేర్చాయన్నారు.
తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయన్నారు. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసి తీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక, నొప్పిని భరిస్తూనే , 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను.
మహర్షి దయానందుని దయవల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని, అందులో విశేషమైన కృషి చేస్తూ , యజ్ఞ బ్రహ్మగా VYPS ( వేద యజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలుగా ఎదిగి, హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని,నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకున్నానని నళిని ఎమోషనల్ అయ్యింది.
ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైల్ ను ఎందుకో తెరిచారో, నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నెండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్కకట్టి( సుమారు 2 కోట్లు) ఇవ్వండని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ను ఇచ్చాను.
వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగానని రాశారు. ( రెండోది వారి పార్టీ పాలసీ కి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేదన్నారు). 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైందని తెలిసింది. నా ఆఫీస్ కాపీ ని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదన్నారు.
మీడియా మిత్రులకు విజ్ఞప్తి. నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండని, రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి ,యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలన్నారు. బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్టుమస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి.
బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దన్నారు. ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే , నాకు సరైన , ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట పడతాను.
లేదంటే .. ఇంకా 3,4 పుస్తకాలు రచించాలని , 100 వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని,మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ... ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
నా పేరు పై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం vyps కు చెందుతుందన్నారు. బ్రతుకుండగా దేశ ప్రధాని ని కలవలేక పోయానని, వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి అని భావోద్వేగంకు గురయ్యారు. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తానన్నారు. నా మనోభావాలను పంచుకొనే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్ కు ధన్యవాదాలంటూ తన చివరి లేఖను రాసుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook