తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో E-Office షురూ

తెలంగాణలో ఎలక్ట్రానిక్ కార్యాలయం (Telangana E-Office) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ఆరు శాఖలను ఈ ఆఫీసు పరిధిలోకి తీసుకొచ్చారు.

Last Updated : Jul 19, 2020, 08:23 AM IST
తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో E-Office షురూ

తెలంగాణ ప్రభుత్వ (Telangana Govt)శాఖల్లో ఎలక్ట్రానిక్ కార్యాలయం (E-Office) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ఆరు శాఖలను ఈ ఆఫీసు పరిధిలోకి తీసుకొచ్చారు. సాధారణ పరిపాలన, స్త్రీశిశు సంక్షేమం, ఆబ్కారీ (ఎక్సైజ్), వాణిజ్య పన్నులు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలను తీసుకొచ్చినట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి ఈ (Telangana E-Office) విధానాన్ని ప్రవేశపెట్టారు. కరోనా కేసులపై ఇరాన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం 1600కి పైగా ఉద్యోగులు ఈ-ఆఫీసు (E-Office In Telangana) విధానం కింద పనిచేయనున్నారు. ప్రస్తుతం 6 శాఖల్లో ప్రవేశపెట్టిన ఈ విధానంలోని త్వరలో మరిన్ని శాఖలు వస్తాయన్నారు. కాగిత రహితంగా పని, సులువగా డాక్యుమెంటేషన్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిస్కరించనున్నట్లు వివరించారు. మోడల్ Shweta Mehta Hot Photos వైరల్       

పరిశ్రమల శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక, మహిళా సంక్షేమం శాఖల కార్యదర్శులు, అబ్కారీ శాఖ కమిసనర్లు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News