)
Electric shock at cloth shop due to snake in Jayashankar bhupalpally: కొన్నిసార్లు చాలా మందికి లక్ అనేది అనుకొని విధంగా కలిసి వస్తుంది. ఏపనిచేసిన కూడా పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది. కానీ మరికొన్నిసార్లు దురదృష్టం కూడా అదే విధంగా వెంటాడుతు ఉంటుంది. అనుకొని విధంగా తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఈ క్రమంలో జయశంకర్ భూపాల పల్లి జిల్లా టేకు మట్లలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్గా మారింది.
గత 15 ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న బట్టల దుకాణం, కూడబెట్టిన డబ్బు ఒక పాము కారణంగా జరిగిన షార్ట్సర్క్యూట్తో కాలి బూడిదయ్యింది. ఈ ఘటనలో రూ.50 లక్షల విలువైన వస్త్రాలు, ఫర్నీచర్, నగదు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో.. వ్యాపారి శ్రీనివాస్ లబో దిబో మంటున్నాడు. రాత్రిపూట షాపు సమీపంలో పాము విద్యుత్ తీగల మీద ఎక్కింది. దీంతో మంటలు అంటుకున్నాయి.
దుకాణం పైన ఉన్న వ్యాపారి వెంటనే అలర్ట్ అయి ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే లక్షల నష్టం వాటిల్లింది. అక్కడున్న సీసీటీవీ చూడగా.. ఒక పాము కరెంట్ తీగల మీద పాకడం వల్ల కరెంట్ షాక్ వల్ల ఈ ఘటన జరిగినట్లు విషయం బైటపడింది.
దీంతో అతను పాము రూపంలో దురదృష్టం వచ్చిందని లబో దిబో మంటున్నాడు. తనను ప్రభుత్వం ఆదుకొవాలని వేడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.