సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు చిరకాల స్వప్నం నెరవేరింది. తాజా మంత్రివర్గం విస్తరణలో ఆయనకు చోటు దక్కింది. రాజ్ భవన్ లో జరిగిన మంత్రివర్గం విస్తరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందిన ఎర్రబెల్లి ..టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. అయితే ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ఆయనకు ఈ సారి మంత్రి పదవి వరించింది.
ఈ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంలో గత పాత జ్ఞాపపకాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానన్నారని.. కానీ అప్పుడు లక్ష్మీపార్వతి వల్ల తనకు పదవి రాలేదని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. అయితే కేసీఆర్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా ఎర్రబెల్లి కొనియాడారు.