)
MLC Kavitha Vs Harish Rao: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం అక్రమాలపై విచారణ కోసం సీబీఐకి అప్పగించింది. అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై చర్చించాక సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాళేశ్వరం రిపోర్టుపై విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి సిఫారసు చేస్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలు అస్సలు ఊహించలేకపోయారు. ఇస్తేగిస్తే సీఐడీ లేదా సిట్ కు అప్పగిస్తారని భావించారు. కానీ అనూహ్యంగా కాళేశ్వరంలో బీఆర్ఎస్ కు రిలీఫ్ దక్కకుండా బీజేపీ చేతికి చిక్కేలా చేశారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సమస్యగా మారింది. ఇదే చాన్స్ అనుకుని బీజేపీ సీబీఐని రంగంలోకి దింపుతుందా లేక రేవంత్ రెడ్డి వ్యూహంలో తాము ఎందుకు పావులుగా మారాలని సైలెంట్ గా ఉంటుందా అనేది గులాబీ పార్టీ లీడర్లకు అర్ధం కావడం లేదనే చర్చ జరుగుతోంది.
అయితే కాళేశ్వర రిపోర్టును సీబీఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన బీఆర్ఎస్ నేతలు ఫామ్హౌస్కు వెళ్లారు. అక్కడ గులాబీ బాస్ కేసీఆర్ సుధీర్ఘ మంతనాలు జరిపారు. అటు న్యాయనిపుణులతోనూ సంప్రదింపులు చేశారు. ఎలా ముందడుగు వేయాలన్నదానిపై చర్చించారు. సీఎం రేవంత్ బీజేపీతో లోపాయికారీగా మాట్లాడుకునే ఈ తీర్మానం చేశారా లేకపోతే.. తామే చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుదంని .. బీజేపీని పావుగా చేసుకున్నారా అన్న కోణంలో సమాలోచనలు చేశారు. అయితే కాళేశ్వరంలో కేసీఆర్ను ఇరికించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సీబీఐ విచారణ కోరుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపునిచ్చారు. ఆలోపే ఎమ్మెల్సీ కవిత రూపంలో బాంబ్ పేలింది. అమెరికా నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఎమ్మెల్సీ కవిత.. కొన్ని గంటల విరామంలోనే మీడియా ముందుకు వచ్చారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
అంతేకాదు ఆమె సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుపై డైరెక్ట్గానే అటాక్ చేశారు.. కేసీఆర్కు అవినీతి మరక వారి వల్లే వచ్చిందని విమర్శించారు. కేసీఆర్పై సీపీఐ ఎంక్వేరీ వేయడంతో కడుపు రగిలిపోతుందన్నారు. తాను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం జరగవచ్చని... అయినా తనకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు కవిత...
అయితే ఇన్నాళ్లు గులాబీ లీడర్లను పరోక్షంగా టార్గెట్ చేసిన కవిత.. ఇప్పుడు డైరెక్ట్గా హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్రావు, సంతోష్ రావు వల్లనే కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ఇద్దరు నేతలు అవినీతి అనకొండలు అని విమర్శించారు. కేసీఆర్ను అడ్డం పెట్టుకుని హరీశ్ రావు, సంతోష్ రావు సొంత ఆస్తులు భారీగా కూడగట్టుకున్నారని ఆరోపించారు. అందుకే హరీశ్ రావుకు మంత్రి పదవి నుంచి తప్పించారని చెప్పుకొచ్చారు. అసలు కాళేశ్వరంలో హరీశ్ రావు పాత్ర లేదని నిరూపిస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్పై అవినీతి మరకపడ్డాక... పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు. మరోవైపు తనపై ఎవరైనా ట్రోల్ చేస్తే తోలు తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. అయితే కవిత మాట్లాడిన కాసేపటికే మాజీమంత్రి హరీశ్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఆరడుగుల బుల్లెంట్ అంటూ ఫైర్ సింబల్తో ఓ పోస్టు పెట్టడం హాట్టాపిక్గా మారింది.
ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ గులాబీ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్లో దెయ్యాలు ఉన్నారంటూ బాంబ్ పేల్చిన కవిత.. ఇప్పుడు నేరుగా హరీశ్రావు, సంతోష్ రావును టార్గెట్ చేశారు. అంతకుముందు మాజీమంత్రి జగదీష్ రెడ్డిని లిల్లిపుట్తో అభివర్ణించారు. ఆ తర్వాత.. కవిత టార్గెట్ కేటీఆరే అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే ఆలోపే కవితపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదీఏమైనా కవితను అధికారికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.